పాఫం పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తానా తెలుగుదేశం పార్టీతో తమ పార్టీ పొత్తు ఉంటుందని.. ఓట్లు చీలనివ్వను అని అన్నారో కానీ అప్పుడే చంద్రబాబుకు బెండ్ అయిపోయారు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తుల కోసం చంద్రబాబే పవన్ వెంట పడాలి. కానీ పవనే ముందే బాబుకు బెండ్ అయిపోయాడు. ఏ 60 సీట్లో వస్తాయనుకుంటే చంద్రబాబు 24 సీట్లు ముష్టి వేస్తే అదే పెద్ద ప్రసాదంగా భావించి తీసుకున్నారు పవన్. కట్ చేస్తే టీడీపీ తో పొత్తు మాత్రమే కాదు.. బీజేపీ కూడా ఉండాలంటూ పవన్ ఎంతో ఆరాట పడ్డారు.
బీజేపీ పొత్తులోకి వచ్చి చేరడంతో పవన్ ఒక ఎంపీ సీటు తో పాటు మరో మూడు అసెంబ్లీ సీట్లు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. విచిత్రం ఏంటంటే ఈ 21 సీట్లలోనూ కావాలంటే ఇంకా త్యాగం చేసే త్యాగ మూర్తి లా ఉన్నాడు పవన్. సరే ఇప్పటి వరకు ఉన్న లెక్క చూస్తే 21 సీట్లు. ఇందులో అయినా జనసేన కేడర్ కు.. పార్టీ కోసం కష్టపడుతోన్న వారికి.. తన అభిమానులకు.. పార్టీ కార్యకర్తలకు కేటాయిస్తున్నాడా అంటే అదీ లేదు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు.. పచ్చ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోళ్లు.. చంద్రబాబు రికమెండేషన్ చేస్తోన్న వాళ్లకే జనసేన లో టిక్కెట్లు దక్కుతున్నాయి.
ఇంతకు మించి న అవమానం పవన్ ఇంకెక్కడ ఉంటుంది. రాజమండ్రి రూరల్ సీటుపై ఆశలు పెట్టుకున్న కందుల దుర్గేస్ను అయిష్టంగా నిడదవోలుకు పంపారు. ఉంగుటూరు లో గన్ని వీరాంజనేయులను పక్కన పెట్టేసి సుబ్బరాజుకు ఇచ్చారు. ఆంజనేయులు ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా కూడా ఆయనకు సీటు దక్కలేదు. తిరుపతి జనసేన అభ్యర్థి ఎవరో కాదు గంటా నరహరి టీడీపీ లీడర్. ఆయన మొన్నటి వరకు రాజంపేట పార్లమెంటు టీడీపీ ఇన్చార్జ్ గా ఉన్నారు.
భీమవరంలో టీడీపీలో నే నిన్నటి వరకు ఉన్న మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అలా పార్టీలోకి వచ్చారో లేదో వెంటనే భీమవరం టిక్కెట్ పవన్ ఇచ్చేశారు. అక్కడ పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడి న వారి నోట్లో పవన్ మట్టికొట్టారు. ఇక కొణాతాల రామకృష్ణకు అనకాపల్లి సీటు ఇచ్చారు. ఆయన కూడా వలస జీవే. అసలు నిన్న మొన్నటి వరకు ఆయన ప్రజల్లోనే లేరు. ఇక చిత్తూరు టిక్కెట్ ఇస్తోన్న అరణి శ్రీనివాసులు తాజా వైసీపీ ఎమ్మెల్యే.
ఆయనకు అక్కడ జగన్ సీటు ఇవ్వలేదు.. ఇటు పవన్ ను కలిసి జనసేన కండువా కప్పుకున్నారో లేదో వెంటనే టిక్కెట్ ఇచ్చేశారు. వీళ్లు మాత్రమే కాదు.. ఇప్పటికే ప్రకటించిన సీట్లతో పాటు పెండింగ్ సీట్లలో ప్రకటించే అభ్యర్థులను చూస్తే అందులో మెజార్టీ పచ్చ పార్టీ నుంచి వచ్చిన వలస నేతలతో పాటు ఇతర పార్టీ వలస జీవులే ఉండబోతున్నారు.