లాక్ డౌన్ కారణంగా దాదాపు 80 రోజుల పాటు భక్తులు, నిత్యం పూజలందుకునే శ్రీవారి ఆలయానికి దూరమవడం జరిగింది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం జూన్ ఎనిమిదో తారీకు నుండి ఆలయాలు ఓపెన్ చేసుకోవచ్చని పరిమిషన్ ఇవ్వటంతో టీటీడీ అధికారులు లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ భక్తులు కూడా పాటించే విధంగా చర్యలు చేపట్టి వెంకన్న దర్శనానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది.
ఈ సందర్భంగా మొదటిసారి టీటీడీ అధికారులు మరియు చుట్టుప్రక్కల స్థానికులతో ట్రైల్ రన్ నిర్వహించి అన్ని జాగ్రత్తలను క్షుణ్ణంగా పరిశీలించి సోమవారం నాడు భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. మొదటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన దర్శనాలు 7:30 వరకు నిరంతరాయంగా సాగించారు. ఈ నేపథ్యంలో 10 సంవత్సరాల చిన్న పిల్లలు మరియు 65 ఏళ్ల పై బడిన వృద్ధులు దర్శనాలకు దూరంగా ఉంచారు. కాగా రీ ఓపెన్ చేసిన తర్వాత శ్రీవారి హుండీ మొదటిరోజు హుండీ ఆదాయం వచ్చి అందరి అంచనాలను తలకిందులు చేసి బంపర్ రికార్డు సృష్టించింది.
ఈ స్థాయిలో స్వామి వారి భక్తుల నుండి రెస్పాన్స్ వస్తోందని టీటీడీ అధికారులు కూడా అనుకోలేదట. ముఖ్యంగా స్వామివారిని దర్శించుకోవాలంటే ఆన్లైన్ ద్వారా దర్శనాల టికెట్ ను పొందుకున్న తర్వాత మాత్రమే ఆలయ సిబ్బంది స్వామివారిని దర్శించుకోవడానికి అనుమతి ఇస్తున్నారు. మరికొద్ది రోజుల్లో వీఐపీలకు ఉదయం గంట పాటు దర్శనం కల్పించడానికి టీటీడీ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కరోనా కారణంగా భక్తులకు కేటాయించిన సమయంలోనే స్వామివారిని దర్శించుకోవడానికి టీటీడీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.