వికారాబాద్: బేగంపేట విమానాశ్రయానికి చెందిన ఒక శిక్షణ విమానం బంట్వారం మండలం సుల్తాన్పూర్ గ్రామ సమీపంలోని పంట పొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ ప్రకాశ్ విశాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. వర్షం కారణంగా విమానం అదుపుతప్పి బురదలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న బేగంపేట ఎయిర్ పోర్ట్ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.