Varun Tej: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కోసం పిఠాపురంలో ఇప్పటికే నాగబాబు, జానీ మాస్టర్, హైపర్ ఆది, పృధ్వి, గెటప్ శ్రీను తదితర సినీ కళాకారులు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు పిఠాపరంలో పవన్ కళ్యాణ్ తరపున మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ప్రచారానికి రానున్నారు.
ఈ మేరకు చేబ్రోలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేముల పాటి అజయ్ కుమార్..ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచార వివరాలను వెల్లడించారు. 27వ తేదీ (శనివారం) మధ్యాహ్నం 3 గంటలకు గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తి గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీ, రోడ్ షో ప్రారంభిస్తారని చెప్పారు. అక్కడ నుండి వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి మీదుగా దుర్గాడ చేరుకుంటారని తెలిపారు.
ప్రచార ర్యాలీ, రోడ్ షో, సమావేశాల్లో వరుణ్ తేజ్ ప్రసంగిస్తారని తెలిపారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల కార్యకర్తలు, అభిమానులు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొని విజయవంతం చేయాలని అజయ్ కోరారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు పంచకర్ల సందీప్,జ్యోతుల శ్రీనివాస్,పిల్లా శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు