Vemulawada: మన భారతదేశం ఎన్నో కుల, మతాలకు నిలయం అని చెప్పవచ్చు. కానీ హిందువులు ప్రముఖ దేవాలయాలను సందర్శించి స్వామి వారిని దర్శించుకుంటారు. అదేవిధంగా ముస్లింలు దర్గాకు వెళ్లి నమాజ్ చేసు కోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. కానీ Vemulawada లో మాత్రం ఇందుకు ఎంతో భిన్నంగా ఉంటుంది. వేములవాడలో ఎంతో ప్రసిద్ధి చెందిన రాజన్న ఆలయానికి ఎంతో మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ఆలయంలోకి వచ్చే భక్తులకు ఎటువంటి కులమతాలు తేడా లేకుండా హిందువులు, ముస్లింలు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శనం చేసుకుంటారు.
పురాతన కథనం ప్రకారం ఈ ఆలయం వెలసినప్పుడు ఆలయం దగ్గరే ఒక ముస్లిం వ్యక్తి ఉండేవాడు. అతను మరణించిన తర్వాత అక్కడే సమాధి అయ్యాడని, ఆ సమాధిపై ఓ మసీదు నిర్మించటం వల్ల పెద్ద సంఖ్యలో ముస్లింలు ఇక్కడకు చేరుకొని ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. అయితే ఈ ఆలయాన్ని దర్శించుకున్న హిందువులు మసీదును దర్శించుకుంటారు. ముస్లింలు రాజన్న దర్శనం చేసుకుంటారు.
ఈ ఆలయంలో ఉన్న స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఎంతోమంది కోడె మొక్కలను చెల్లించుకుంటారు. ఈ విధంగా కోడె మొక్కులు చెల్లించుకున్న భక్తులు తమ కోరిక నెరవేరగానే ఒక కోడెను (ఎద్దును) తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టుకు కట్టేసి స్వామివారి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన అప్సర్ షాహిన అనే ముస్లిం మహిళ మంగళవారం కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఈ విధంగా ఓ ముస్లిం మహిళ స్వామి వారిని దర్శించుకొని మత సామరస్యాన్ని ప్రదర్శించడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.