Viral: ఆలు..ప్రస్తుతం అక్కడి హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఎంత డిమాండ్ ఉన్నా కూడా ధర వందల్లోనే ఉంటుంది. కానీ అక్కడ ఆలు కిలో ధర 3 వేలు ఉండడంతో అందరు షాక్ అయ్యారు. రానురాను ధరలు పెరుగుతాయంటే ఏంటో అనుకున్నారు కానీ కొనలేనంత ధర ఉంటుందని ఎవరు అనుకోలేదు. ముఖ్యంగా బయటినుంచి ఆహారం దిగుమతి పడిపోవడం, అక్కడి బ్యాంకులు పనిచేయకపోవడం, వస్తువుల ధరలు కూడా భారీగా పెరుగుతుండడంతో తినే వాటి ధర కూడా ఆకాశాన్ని అంటుతోంది. ధనికులు సైతం ఇక్కడి ఆలు కొనాలంటే ఆలోచించాల్సి వస్తుంది.
Protein Shake: ప్రోటీన్ షేక్ అందరూ తాగుతున్నారా..!? అయితే ఇది తెలుసుకోండి..!!
ప్రస్తుతం అఫ్గానిస్తాన్ పరిస్థితుల గురించి కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా అక్కడి పరిస్థితులు భయాందోళనకు గురిచేసాయి. అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికి తెలిసిందే. కడుపు నిండా మూడు పూటలు తిండి తినాలంటేనే కష్టం అయిపోయింది. పిల్లలు ఆకలి అంటే ఎవరు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. పిల్లల ఆకలి తీర్చడానికి విలువైన వస్తువులని సైతం అమ్మేస్తున్నారు. అక్కడి వీడియోలు చూసాక అయ్యో..పాపం అని అనకుండా ఉండలేం.
Bheemla Nayak: ధర్మేంద్ర అంటూ దద్దరిల్లిపోయే డైలాగులతో వచ్చేసిన డానియల్ శేఖర్..!
విలువైన వస్తువులే కాదు ఏది ఏదైనా అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా తిండి కోసం. తిండి కోసం ఇంతలా కష్టపడుతున్నారు అంటే అక్కడి పరిస్థితి మనకు అర్థం అవుతుంది. కార్లు, బైకులు కూడా అమ్మేస్తున్నారు. ఇది వరకు పిల్లలు చూడడానికి ఎంతో ఇష్టంగా కొన్న టీవీలు కూడా అమ్మేస్తున్నారు. ఫ్రిడ్జ్ కు అమ్మేసి తిండి దొరికితే చాలులే అనుకుంటున్నారు. తిండి దొరికితే చాలు ఇంట్లో ఏ వస్తువునైనా అమ్మెందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ మద్యే ఒక వ్యాపారి తన ఇంట్లోకి రూ.25వేలు పెట్టి కొన్న ఫ్రిజ్ ను కేవలం రూ.5వేలకు అమ్మేశారు. ఇంట్లో పిల్లలకి, భార్యకి అన్నం తేవడానికి ఈ నిర్ణయం తీసుకున్నాడు.
BREAKING: నాగార్జునను మామ అని పిలుస్తూ ఒకే ఒక ట్వీట్ తో రూమర్స్ అన్నిటికీ సమాధానం చెప్పిన సమంత..!
కొంత మంది దగ్గర అమ్ముకోడానికి కూడా ఇంకా ఏమి మిగలలేదు. కొంత మంది భోజనం చేసి మూడురోజులు అవుతుందని చెప్పడం గమనార్హం. ఈ సంఘటలను అన్ని చూసాక అఫ్గాన్లు ఎంతటి దారుణ పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలుస్తుంది. అయితే సగం ధర వచ్చినా పర్లేదు అని ఇంట్లోని వస్తువులని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే లక్ష రూపాయల వస్తువు 10 వేళకే వస్తుంది అన్నా కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఆ దేశంలో కనీసం రెండు కోట్ల మందికి తినటానికి తిండి కూడా దొరకదన్న విషయాన్ని పదిహేను రోజుల క్రితమే ఐక్యరాజ్య సమితి నిపుణులు ప్రకటించినట్లే తాజా పరిస్థితి నెలకొంది. అఫ్గాన్ ను అక్రమించిన తాలిబన్ల ఏలుబడి మొదలై దాదాపు నెల కావొస్తోంది. రోజురోజుకు పరిస్థితి మరింత ఇబ్బందికరంగామారటమే తప్పించి.. పరిస్థితుల్లో మార్పు రావటం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితే మరికొంత కాలం సాగితే.. అఫ్గాన్ లో ఆకలి చావులు భారీగా చోటు చేసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Bigg Boss 5 Telugu: మూడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ లో మరోసారి సన్నీ వర్సెస్ ప్రియా..!!