Viral News : నంద్యాల మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపులో ఒక ఆసక్తికర విషయం నెలకొంది.. ఓట్ల లెక్కింపులో భాగంగా 29వ వార్డు లెక్కింపు జరుపుతుండగా బ్యాలెట్ బాక్స్ ల్లో వచ్చిన స్లిప్పులు సదరు సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేశాయి..!! సదరు ఓటరు రాసిన లేఖ అందరిని ఆశ్చర్య పరిచింది.. ఇంతకీ ఆ ఓటరు రాసిన లేఖ సారాంశం ఏమిటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు మందు బాబులు..
“నంద్యాల తాగుబోతుల విన్నపం” పేరుతో ముఖ్యమంత్రికి లేఖ రాశాడు ఒక ఓటరు.. లేఖ సారాంశం ఏమిటంటే.. ” మద్యం అమ్మకాలలో కొత్త బ్రాండ్లు అయిన సుప్రీం, దారు , హైదరాబాద్, జంబో తదితరాలను తొలగించి.. పాత బ్రాండ్లు అయిన రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్ వంటి రకాల అమ్మకాలు జరపాలని ” విన్నవిస్తూ ముఖ్యమంత్రికి లెటర్ రాసాడు. పాత బ్రాండ్లు అమ్మకపోతే.. ఇదే తమ ఆఖరి ఓటు అవుతుందని అంటూ లేఖలో సదరు ఓటరు హెచ్చరించారు.. ఈ విషయం పై ముఖ్యమంత్రికి జగన్ మోహన్ రెడ్డి స్పందించి “నంద్యాల తాగుబోతుల విన్నపం” తీరుస్తారా లేదా అన్నది చూడాలి..