సాధారణంగా టాక్సీ లు రోడ్లపై తిరుగుతాయి.. కాని కేరళ లో అందుకు భిన్నం .. అక్కడ టాక్సీ లు వాటర్ లో ప్రయాణిస్తున్నాయి.. వినడానికి కొంత ఆశ్చర్యాన్ని కలిగించిన ఇది నిజమే.. రోడ్లపై ట్రాఫిక్ సమస్యను తగ్గించే ప్రక్రియలో వచ్చిన ఆలోచన ఇది.. పర్యాటకులను ఆకర్షించడంలో కేరళ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.. కొత్తగా వాటర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కు అంగీకరించింది.. ఈ సర్వీస్ ను రాష్ట్రంలో వాటర్ టాక్సీ అని పిలుస్తారు .. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లడానికి పదిమంది సీటింగ్ కెపాసిటీ తో కూడిన సర్వీసును మొదలు పెట్టారు.. దీనికి అదనంగా మరో మూడు బోట్లను అందిస్తుంది..
అలప్పుజా బ్యాక్ వాటర్స్ లో అక్టోబర్ నుంచి నాలుగు బోట్లతో జిల్లా వ్యాప్తంగా సర్వీసు అందిస్తున్న దీనిని మరింత విస్తరిస్తుంది. కొత్తగా ఫోన్ ద్వారా బుకింగ్ సేవలను అందిస్తుంది . డీజిల్ ఇంజన్లతో ఈ వాటర్ టాక్సీ నడుస్తాయి.. ఇది క్యాట మరాన్ డీజిల్ పవర్డ్ బోట్. ఇందులో పది మంది కూర్చుని కెపాసిటీ ఉంది. గంటకు 15 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని వలన ప్రయాణికులు గమ్యస్థానాలకు వేగంగా చేరుకునే అవకాశం ఉంది.
షాజీ వి నాయర్ డైరెక్టర్ ఎస్డబ్ల్యూటీడీ మాట్లాడుతూ, రోడ్లపై టాక్సీలు పని చేసినట్టుగానే ఈ పడవలు పబ్లిక్ అందరికీ అందుబాటులో ఉంటాయి. ఫోన్ చేసి రైడ్ బుక్ చేసుకుంటే వచ్చి పికప్ చేసుకుని గమ్య స్థానంలో డ్రాప్ చేసి వెళ్తారు. వీటి ధరలను గంటల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. బోట్ స్టేషన్లతో కమ్యూనికేషన్ బట్టి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సర్వీసులు అందిస్తాయి. తొలి దశలో అక్టోబర్ నెల నాలుగు బోట్లతో ఉండగా, రెండో దశలో మరో మూడు బోట్లను తీసుకురానున్నారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!