కడప జిల్లా వేముల మండలం చాగరేవు గ్రామంలో వినాయక విగ్రహాన్ని గురువారం రాత్రి దుండగులు అపహరించారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికలు సమాచారంతో ఎస్ఐ సంజీవరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇప్పటికే విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనపై బీజెపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. దేవాలయాలపై ఘటనలను పురస్కరించుకుని ప్రభుత్వంపై బీజెపీ, హిందూ సంఘాలు, టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండగా ప్రభుత్వం కూడా ఈ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నది. ఆలయాలపై దాడుల వ్యవహరంలో కుట్ర కోణం దాగి ఉందని ఇప్పటికే ప్రభుత్వం, పోలీసు యంత్రాగం ప్రాధమిక అంచనాకు వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా దీనిపై సీరియస్ తీసుకున్నారు. రాష్ట్రంలో మత విధ్వేషాలను రెచ్చగొట్టే కుట్రలో భాగంగా ఇవి చేస్తున్నారనేది ప్రభుత్వం భావిస్తున్నది. దేశ వ్యాప్తంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో రాష్ట్రం దూసుకువెళుతున్న క్రమంలో మతకల్లోలాలను సృష్టించడం ద్వారా శాంతి భద్రతలను దెబ్బతీసి అభివృద్ధిని నిరోధించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నాయని స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధికారులు, వివిధ మతాలకు చెందిన ప్రతినిధులతో మతసామరస్య కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…