ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ఏ ఇద్దరు వైసీపీ నాయకులు తారసపడినా.. ఫోన్లు చేసుకున్నా.. `అయిపోయింది బ్రో! కొంప ముంచేశాడుగా. తడిగుడ్డేసుకోవడమే` అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి దీనికి కారణం ఏంటి? అంటే అమలాపురం పార్లమెంటు టికెట్ను వైసీపీ అధినేత జగన్.. జంపింగ్ నాయకుడు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు కట్టబెట్టడమే. ఈయనపై స్థానికంగా అనే వివాదాలు ఉండడం.. బలమైన నాయకుడు కాకపోవడం.. వంటివి ఓటమిని ఆహ్వానిస్తున్నాయనేది వైసీపీ స్థానిక నేతల టాక్.
మరోవైపు.. రాజోలులో గత ఎన్నికల్లో జనసేన తరఫున విజయం దక్కించుకున్న రాపాక.. తర్వాత అధినేత పవన్కు కనీసం చెప్పకుండానే పార్టీకి దూరమయ్యారు. వైసీపీకి జై కొట్టారు. అంతేకాదు.. తనను ప్రశ్నించిన జనసేన నాయకులు, కార్యకర్తలపై తన వారితోదౌర్జన్యాలు చేయించారనే వాదన కూడా ఉంది. ఇక, పోలీసు కేసులు షరా మామూలే అన్నట్టుగా మారాయి. దీంతో జనసేన వర్గాలు.. పవన్ అభిమానులు రాపాక అంటే.. మండి పోతున్నారు. `ఆయన మళ్లీ పోటీ చేయకపోతాడా!` అని ఎదురు చూస్తున్నారు.
ఇది రాపాకపై తీవ్ర ప్రభావం చూపించనుంది. అంటే.. జనసేన ఓటు బ్యాంకు మొత్తం తమకు ఇష్టం ఉన్నా లేకున్నా.. అవసరమైతే.. వేరే వారికైనా లేక పోతే నోటాకైనా వేసేస్తారు తప్ప.. రాపాకకు మాత్రం ఒక్క ఓటు పడదు. పైగా.. జనసేన నేతలకు మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా ఉంది. ఇది మరింత విస్తరించే ప్రమాదం ఉంది. దీంతో వైసీపీలోనే చాలా మంది నాయకులు రాపాకకు పార్లమెంటు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఒకానొక సందర్భంలో రాపాక కూడా.. పార్లమెంటుకు పోటీ చేసి చేతులు కాల్చుకోవడమేనని వ్యాఖ్యానించేశారు.
ఇక గత రాజోలు ఎన్నికల్లో చావుతప్పినట్టుగా రాపాక బయట పడ్డారు. కేవలం 800పైచిలుకు ఓట్ల మెజారి టీతోనే ఆయన బయట పడ్డారు. అది కూడా బలమైన ఎస్సీ సామాజిక వర్గం.. గతంలో తాను గెలిచి ఉన్న నియోజకవర్గంలోనే రాపాక ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు ఏడు అసెంబ్లీ నియోజకవ ర్గాలను దాటుకుని అమలాపురంలో గెలుపు గుర్రంఎక్కడం సాధ్యమేనా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి ఏం చేస్తారో.. ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం అయితే.. వైసీపీ నాయకులు.. `మునిగిపోయాం బ్రో` అనేస్తున్నారు.