విజయనగరం జిల్లాలోని కీకలమైన నియోజకవర్గం బొబ్బిలి. బొబ్బిలి రాజుల ప్రాబల్యం అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరుప్రజలతో జేజేలు కొట్టించుకుంటారు? అనేది ఆసక్తిగా మారింది. ఇక్క ఇప్పటివరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, మూడుసార్లు టీడీపీ, రెండుసార్లు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరోసారి ఎన్నికలకు నియోకజవర్గం సిద్ధం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి ఇక్కడ సర్వత్రా నెలకొంది.
1983లో జరిగిన ఎన్నికల్లో ఎస్వీసీఏ నాయుడు టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1985లోనూ టీడీపీ మరోసారి గెలుపు గుర్రం ఎక్కింది. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పి జగన్మోహనరావు విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్వీసీఏ నాయుడు విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పి జగన్మోహనరావు విజయాన్ని దక్కించుకున్నారు. 2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సుజయ కృష్ణరంగారావు గెలిచారు. 2009లోమరోసారి ఆయనే విజయాన్ని దక్కించుకున్నారు.
2014లో సుజయ కృష్ణ రంగారావు మూడోసారి వైసీపీ టికెట్పై పోటీ చేసి విజయం సాధించారు. అయితే.. మధ్యలో ఆయన పార్టీ మారి టీడీపీ కండువా కప్పుకొన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన చిన అప్పలనాయుడు విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన సుజయ కృష్ణ రంగారావుపై 8352 ఓట్ల తేడాతో గెలుపొందారు. మరోసారి శంబంగి చిన్న అప్పలనా యుడు వైసీపీ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండగా, టీడీపీ నుంచి బేబీ నాయన పోటీకి సిద్ధపడుతున్నారు. అయితే.. టీడీపీ ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయలేదు.
ఇక, పార్టీల పరంగా చూసుకుంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్న అప్పలనాయుడిపై వ్యతిరేకత పెరిగిందనే వాదన వినిపిస్తోంది. దీంతో టీడీపీకి అనుకూలంగా పవనాలు వీస్తున్నాయి. అయితే.. ప్రభుత్వ పథకాలే తనను గెలిపిస్తాయని అప్పలనాయుడు చెబుతు న్నారు. ఆయన ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్రజలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక, టీడీపీ తరఫున టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా.. బేబినాయన క్షేత్రస్థాయిలో ఉన్నారు. పార్టీ కార్యకర్తలను ఏకం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.