యుక్త వయసులో కొండలనైనా పిండి చేయగల శక్తి సామర్థ్యాలుంటాయి. కాని వృద్దాప్యం రాగానే చిన్న చిన్న పనులను కూడా చేయలేకపోతారు. కాని నాటి కాలం మనుషులు వృద్దాప్యంలోనూ చాలా గట్టిగా ఉండేవారంటారు కొందరు. అదే నేటి కాలంలో మధ్యవయసు రాగానే రామ కృష్ణా అంటూ, ఇక నేనేమి పనిచేయలేనని బాధపడిపోతుంటారు. దీనికి రకరకాల కారణాలు లేకపోలేదు. మందుల ఆహారం, పనిఒత్తిడి, కాలుష్యం.. ఇలా రకరకాల కారణాలతో మనుషులు తొందరగా అనరోగ్యం పాలవుతున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వృద్ధులకు వారికి కావాల్సిన చిన్న చిన్న అవసరాలను కూడా తీర్చుకోలేక పోతున్నారు. మరీ ముఖ్యంగా కరోనా వచ్చినప్పటి నుంచీ ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. అందుకే వీరి కోసమే ప్రత్యేకంగా సర్వీసులను అందిస్తోంది పూణే ఆధారిత కంపెనీ ఒకటి. లాక్ డౌన్ మొదపైనప్పటి నుంచి వఈద్ధులకు అవసరమైన ప్రతి వస్తువునూ ఇంటికి చేరవేసే పనిలో పడింది. అదే..సీనియారిటీ కంపెనీ..సీనియర్ క్యూరేటెడ్ ఉత్పత్తులను సీనియర్ సిటిజన్లకు అందించడంలో ఎంతో పేరు తెచ్చుంకుంది.
60 ఏండ్లు పైబడిన వృద్ధులు ముఖ్యంగా కరోనా కారణంగా ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావడంలేదు. అందుకే వృద్ధులు వైద్య, సంరక్షణ, జీవనశైలి, విశ్రాంతికి సంబంధించి 10,000 ఉత్పత్తులను కంపెనీ విక్రయిస్తోంది. రోజుకు 1,500 వరకు కంపెనీకి ఆర్డర్లు వస్తుంటాయి. దీనిని 2016 లో సీనియర్ సిటీజన్లను ధృష్టిలో ఉంచుకుని ఆయూష్ అగర్వాల్, తాపన్ మిశ్రా అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రారంభించారు. సీనియర్ సిటిజన్ల కోసం అందించే ఉత్పత్తుల్లో వాకర్లు, రోలేటర్లు, వీల్ చైర్లు, ఫిట్ నెస్ గేర్లు, బెడ్ రూం యాక్ససరీస్ వంటి ప్రొడక్ట్స్ ను అందిస్తోంది ఈ సంస్థ.
అలాగే వారికి అవసరమయ్యే ఇంటికి అవసరమయ్యేవి, తోటపని, కిచెన్, డైనింగ్, మ్యూజిక్ ప్రొడక్ట్స్, ఫుడ్, న్యూట్రిషన్, గిఫ్టింగ్ వస్తువులను కూడా కొనుగోలు చేస్తున్నారు. దేశంలో మొత్తం నాలుగు నగరాల్లో ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ తో పాటు రిటైల్ ఎక్స్ పీరియన్స్ జోన్ తను పూణే, చెన్నై, కోయంబత్తూర్ భివాడి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిది. మొదటగా అక్టోబర్ 2020 లో సంస్థ తన మొదటి ఫ్రాంచైజ్ స్టోర్ ను పూణేలో ప్రారంభించింది. అలాగే రానున్న రెండేండ్లలో తమ నెట్ వర్క్ ను దేశం మొత్తం మీద విస్తరించాలని కంపెనీ భావిస్తోంది.