కట్టుకున్న భార్యనే బ్లాక్ మెయిల్ చేసి ఏకంగా కోటి రూపాయలు నొక్కేశాడు.చివరకు కటకటాల పాలయ్యాడు.గచ్చిబౌలిలో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి .. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న భార్యకు ఆమె భర్త సంతోష్ నుండి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది.
మిత్రుడి పేరుతో మెసేజ్లు, అశ్లీల ఫొటోలని సంతోషే భార్యకు పంపించి బ్లాక్మెయిల్కు దిగాడు. తాను కోరినన్ని డబ్బులు ఇవ్వకుంటే ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి సుమారుగా రూ.కోటి వరకు వసూలు చేశాడు.కాగా భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఇతని భార్య సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి దర్యాప్తులో సంతోష్ దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
ఇతను భార్యనే కాదు గతంలో కూడా కొంతమంది మహిళలను సంతోష్ ఇలా వేధించినట్టు తెలిపిన సైబరాబాద్ మహిళా పోలీసులు సంతోష్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.. చెడు వ్యసనాలకు బానిసగా మారిన ఇతను ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాడని ఈ క్రమంలో చివరికి కట్టుకున్న భార్యను కూడా మోసం చేసి దొరికిపోయాడని మాదాపూర్ ఏసీపీ శ్యామ్ తెలిపారు..డబ్బు కోసం ఇలా అడ్డదారులు తొక్కి భార్యనే బెదిరించి కోటి రూపాయలు గుంజిన సంతోష్ లాంటి భర్తను చూశాక కుటుంబ విలువలు ఏమైపోతున్నాయన్న ఆవేదన కలుగుతోంది.