చాలా మంది యువత ముఖంపై ఏర్పడిన మచ్చలతో తెగ బాధపడిపోతుంటారు. ఎలా వీటిని మాయం చేయాలంటూ తెగ హైరనా పడిపోతుంటారు. మరీ ముఖ్యంగా స్కిన్ కేర్ కోసం అధిక ఖర్చు చేయాల్సి వస్తుందని బాధపడిపోతుంటారు. మనం తీసుకునే ఫుడ్, లైఫ్ స్టైల్, స్కిన్ టైప్ వలన చాలా మంది పిగ్మెంటేషన్ సమస్య వలన బాధపడుతుంటారు. దీని వలన చర్మం నిర్జీవంగా, పేలవంగా తయారవుతుంది. అయితే ఈ పిగ్మింటేషన్ వలన మచ్చలు కూడా ఏర్పడతాయి.
అయితే దాని నివారణ మాత్రం అది డబ్బులున్నోళ్లకే అందుబాటులో ఉంటుందని భావిస్తారు. అదీ నిజమే కాని దానిని నివారించడానికి మీ ఇంట్లోనే కొన్ని చిట్కాలతో దూరం చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో చదివేయండి..రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ గంధం పొడి, చిటికెడు పసుపు తీసుకోవాలి. అలాగే రెండు టీ స్పూన్ల పాలులను అన్నింటినీ బాగా కలుపుకుని ముఖమంతా అప్లై చేసుకోవాలి.
ఇది ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే రెండు టేబుల్ స్పూన్ల అలొవేరా జెల్ తీసుకుని దానిలో ఒక టీ స్పూన్ తేనెను కలుపుకోవాలి. దానిని ఒక పదినిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత పిగ్మెంటేషన్ ఉన్న స్థలంలో దానిని అప్లై చేసి అది ఆరిన తరువాత గోరు వెచ్చటి నీటితో కడగాలి. అలాగే లికోరిస్ వేర్లను ఒక నాలుగైదు తీసుకుని వాటిని వేడి నీటిలో మరగబెట్టాలి. వాటిని తీసి చల్లార బెట్టాలి. ఆనీటిని ఒక స్ప్రే బాటిలో పోసుకుని రోజుకు రెండు సార్లు మిస్ట్ లాగా అప్లై చేసుకోవాలి.
వాటిని వాడుకున్నాకా ఆ నీటిని ఫ్రిజ్ లో స్టోర్ చేస్తే ఎనిమిది నుంచి పది రోజుల దాకా నిలువుంటుంది. వీటితో పాటుగా పాలు కూడా పిగ్మెంటేషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనికోసం కొన్ని పాలు తీసుకుని అందులో దూదిని ముంచి తీసి దానిని అవసరమైన చోట రాయాలి. అది ఆరిన తర్వాత గోరు వచ్చటి నీటితో కడగాలి. ఇలా చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. దీనితో పాటుగా ఒక టమాటాను తీసుకుని దానిని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి. అందులో ఒక భాగాన్ని తీసుకుని పిగ్మెంటేషన్ ఉన్న స్థలంలో రుద్దాలి. అది ఆరిన తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఈ పద్దతులను వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.