చాలా రోజుల క్రితం టాలీవుడ్ ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా ఆరోగ్యం గురించి ఎన్నో ఊహాగానాలు బయటకు వచ్చాయి. అతను తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు అని… అతనికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని…. చావు బతుకుల మధ్య వున్నాడు అన్నట్లు మరి కొందరు ఎన్నో వార్తలు రాశారు. అయితే వాటన్నింటినీ అప్పుడు రానా ఖండించాదు కానీ ఇప్పుడు సెన్సేషనల్ రీతిలో ఓపెన్ అయ్యాడు.
అక్కినేని సమంత హోస్ట్ గా ‘ఆహా’ కోసం నిర్వహిస్తున్న ‘సామ్ జామ్’ కార్యక్రమంలో దగ్గుబాటి రానా తో పాటు యువ దర్శకుడు నాగ అశ్విన్ అతిథులుగా విచ్చేశారు. ఇక ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. చాలా వరకూ అంతా సరదాగానే ఉంది కానీ రెండో భాగం మాత్రం ఒక సినిమా తరహాలో ఉద్వేగభరితంగా సాగింది. జీవితంలో బాధ కలిగించే వార్తలు వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏమిటి అని సమంత అడిగిన ప్రశ్నకు రానా సమాధానాలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి.
విషయం ఏమిటంటే రానా నాకు పుట్టినప్పటినుండి బిపి ఉందట. ఇక ఒకానొక దశలో అతని రెండు కిడ్నీలు పాడైపోయాయి అని వెల్లడించాడు. ఇక గుండెపోటు రావడానికి 70 శాతం చాన్సులు, ప్రాణం పోవడానికి 30 శాతం చాన్సులు ఉన్నాయని డాక్టర్లు చెప్పినట్లు బహిర్గతం చేశాడు. మన జీవితం మంచి ఊపులో వెళ్తున్నప్పుడు ఇది ఒక పాజ్ బటన్ లాగా వస్తుందని…. అందరికీ ఇంతేనని అందుకు తన జీవితమే ఒక ఉదాహరణ అని చెప్పాడు. అయితే అది క్లిష్ట పరిస్థితుల్లో రానా బాగా ధైర్యంగా నిలబడడం అద్భుతం అని అతను ఒక సూపర్ హీరో అని సమంత కూడా ఎమోషనల్గా వ్యాఖ్యానించింది.
ప్రస్తుతానికైతే రానా ఆరోగ్య పరిస్థితిని వెల్లడించలేదు కానీ అతను బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ’అరణ్య’ షూటింగ్లో బాగానే పాల్గొన్నాడు. అది కాకుండా మిహిక బజాజ్ ను ఇటీవలే మనువాడాడు. అయితే గతంలో అతని అనారోగ్యం పైన వచ్చిన కొన్ని వార్తలు నిజమేనని ఇప్పుడు అర్థం అవుతోంది. అటువంటి సమయంలో అనవసరమైన రగడ ఎందుకని సురేష్ బాబు తో పాటు రానా కూడా వాటిని కొట్టిపారేశారు కానీ నిదానంగా ప్రేక్షకుల ముందుకు అసలైన విషయాన్ని వెల్లడించారు. ఎంతైనా శారీరకంగా దృఢంగా ఉండే రానా ఇలా మానసికంగా కూడా అదే స్థాయి నిలకడ ప్రదర్శించడం మామూలు విషయం అయితే కాదు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!