NewsOrbit
న్యూస్

హైకోర్టు అక్షింతల కష్టాలు ఎందుకో జగన్ కి ఇన్నాళ్ళకి అర్థం అయ్యిందా?

 

ఒక పక్క ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలుతో ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తున్నా, మరో పక్క ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను హైకోర్టు తప్పు పడుతూ మొట్టికాయలు వేస్తున్న సంగతి తెలిసిందే.

 

జగన్ సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు న్యాయ సమీక్ష లో నిలబడటం లేదు. జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలనలో సుమారు 65 అంశాలను హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు సంబంధించి పలువురు హైకోర్టు ను ఆశ్రయిస్తుండటంతో ప్రభుత్వ నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఈ పర్యవసానంగా ఒకటి రెండు సందర్భాలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపి హైకోర్టు గడప తొక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపధ్యంలో హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘సరైన న్యాయసలహాలు మీకు అందడం లేదు. అదే విషయాన్ని చెబుదామని హైకోర్టుకు పిలిపించామని .. డీజీపీకి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తప్పుడు న్యాయ సలహాల వల్లే అధికారులు అదే పనిగా హైకోర్టుకు హాజరు కావాల్సి వస్తోందని కొంత కాలంగా విమర్శలు వస్తున్నాయి.

కొద్ది కాలంగా ఏపీ హైకోర్టుల తీర్పులను సైతం పట్టించుకోని వాతావరణం ఉంది. దీనికి కారణం.. లీగల్ టీం ఇస్తున్న సలహాలే కారణమని
అనుకుంటున్నారు. న్యాయ బృందం
విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి కనిపిస్తోంది.

ప్రభుత్వాన్ని న్యాయవ్యవస్థకు బద్ద వ్యతిరేకిగా తీర్చిదిద్దేలా.. న్యాయ సలహాదారులు, ఇతర బృందం తీసుకుంటున్న చర్యలు ఉంటున్నాయని అంటున్నారు. చట్ట, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు కోర్టుల్లో నిలబడవని అందరికీ తెలిసిందే.
సామాన్యులు కూడా అంచనా వేయగలిగే అంశాలను లీగల్ టీం.. సుప్రీంకోర్టు వరకూ తీసుకెళ్లి ప్రభుత్వానికి మొట్టికాయలు వేయిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల విషయంలో అధికారులు అదే పనిగా కోర్టు ఎదుట హాజరు కావాల్సి వచ్చింది.

చట్ట విరుద్ధమైన సలహాలతో.. హైకోర్టులోనూ.. సుప్రీం కోర్టులోనూ ప్రభుత్వం పరువు పోయేలా లీగల్ టీం వ్యవహరిస్తోందనీ విమర్శలు వస్తున్నాయి. ఒక్క రంగుల విషయంలోనే కాదు, ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు, ఎస్‌ఈసీ విషయంలోనూ అదే పరిస్థితి.

ప్రభుత్వం పెట్టుకున్న కొందరు న్యాయవాదులు,
న్యాయ నిపుణులు మిడిమిడి జ్ఞానంతో వ్యవహరిస్తూ.. అధికారులకు ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తున్నారని అంటున్నారు.

మూడో సారి డీజీపీకి కోర్టుకు హాజరైన కేసులో… కోర్టు ఒకటి చెబితే ప్రభుత్వ న్యాయవాదులు మరొకటి చేశారట. కనీసం పిటిషన్లు, కౌంటర్లు కూడా
సక్రమంగా వేయడం రాకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju