YSRCP: రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధులను వైసీపీ ఖరారు చేసింది. రాజ్యసభ బరిలోకి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు రఘునాథరెడ్డి పేర్లను సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు.
ప్రస్తుతం ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలు తామే దక్కించుకునేలా వైసీపీ చర్యలు తీసుకుంటోంది. త్వరలో మాక్ పోలింగ్ కూడా నిర్వహించనున్నారు. కాగా, ఈ రోజు నుండి 15వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే ఈ నెల 12వ తేదీన వైసీపీ ముగ్గురు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 27వ తేదీన మూడు రాజ్యసభ రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. కౌంటింగ్ కూడా అదే రోజు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు.
ఈ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి లు కృతజ్ఞతలు తలిపారు. ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను సీఎం జగన్ అబినంధించారు.
వైవీ సుబ్బారెడ్డికి గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ సిట్టింగ్ స్థానాన్ని వదులుకున్న సందర్భంలోనే రాజ్యసభ హామీ ఇచ్చారు వైఎస్ జగన్. అయితే రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు వైవీకి ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేరుతోంది. పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబూరావు స్థానంలో వేరే నేతకు పార్టీ ఇన్ చార్జి గా నియమించిన నేపథ్యంలో ఆయనకు రాజ్యసభకు అవకాశం కల్పించారు.
రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి సోదరుడైన రఘునాథరెడ్డి తన 20 ఏళ్ల వయస్సులోనే బెంగళూరు కేంద్రంగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. 2006లో ఎంఆర్ కేఆర్ కన్ట్సక్షన్స్ డైరెక్టర్ గా నియమితులైయ్యారు. ప్రస్తుతం వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు. టీడీపీ నుండి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోతే వైసీపీ ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నిక అవుతారు.
Breaking: జగన్ పై హత్యాయత్నం కేసు .. కోడికత్తి శ్రీనుకు షరతులతో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు