గుంటూరు, ఏప్రిల్ 20 : మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ విజయం కోసం కోట్లాది రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారని వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గంటూరు పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుమారుడి గెలుపు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు.
రాష్ట్రంలో భారీగా పోలింగ్ శాతం పెరిగిందనీ, ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని రామకృష్ణారెడ్డి అన్నారు. ఎవరు ఎన్ని చేసినా వైసిపి విజయాన్ని ఆపలేరనీ, మే 23వ తేదీ తరువాత రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆళ్ల జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని ఆళ్ల ఎద్దేవా చేశారు.