కడప: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేజిక్కించునే లక్ష్యంగా బిజెపి పావులు కదుపుతున్నదని కన్నా అన్నారు. కడపలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపిలో చేరేందుకు పలు పార్టీల నాయకులు సిద్ధంగా ఉన్నారని కన్నా పేర్కొన్నారు. వైసిపి, టిడిపి, జనసేన పార్టీల నుండి చాలా మంది నాయకులు త్వరలో చేరనున్నారని కన్నా తెలిపారు. దేశంలో ఎక్కువ సభ్యత్వాలు ఉన్న పార్టీ బిజెపియేనని కన్నా అన్నారు.
previous post
next post