NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఇళ్ల పట్టాలపై మరో వివాదం…! ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్..!!

 

వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ కు పలు కీలక నిర్ణయాల విషయంలో ఏపి హైకోర్టు నుండి షాక్ లు తగలడం పరిపాటిగా మారింది. హైకోర్టుకు వెళుతున్న అనేక అంశాలలో ఒకటి రెండు మినహా దాదాపు అత్యధిక విషయాల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. నేడు తాజాగా రాజమహేంద్రవరం వైశ్వ సేవా సదన్ భూములను ఇళ్ల పట్టాలుగా ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది.

ap high court

ఏపి హైకోర్టులో శుక్రవారం రాజమహేంద్రవరం వైశ్య సేవా సదన్ భూములను ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీకి తీసుకున్న నిర్ణయంపై విచారణ జరిగింది. 1922లో తెలుగు, సంస్కృతం అభివృద్ధి, వైశ్య పేద మహిళల సహాయం చేయడం కోసం ఈ వైశ్య సదన్ ఏర్పడినట్లు పిటిషనర్ తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్ తరపున వాదనలు విన్న హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని వైశ్యసదన్ కు నోటీసులు జారీ చేస్తూ కేసు విచారణను అక్టోబర్ నెలకు వాయిదా వేసింది.

ఈ సందర్భంగా పిటిషనర్ తరుపు న్యాయవాది మాట్లాడుతూ వైశ్య సదన్ కు దాదాపు 500 ఎకరాల భూముల్లో అనేక భవనాలను, కాలేజీలను, ఆలయాలు ఇవన్నీ ఏర్పాటు చేశారని చెప్పారు. వీటిపై వచ్చే ఆదాయంతోనే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సేవా సదన్ కు సంబంధించిన 32 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీకి తీసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టగా మార్చి 16 న దేవాదాయ శాఖ కమిషనర్ ఈ భూములను తీసుకోవడానికి వీలు లేదని, హైకోర్టు తీసుకోవద్దని చెప్పిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారని తెలిపారు. ఈ వివరాలు ఇచ్చినా ప్రభుత్వం గానీ, అధికారులు గానీ పట్టించుకోకుండా ముందుకే వెళుతున్నారని ఈ నేపథ్యంలో ఒ ప్రముఖుడు పిల్ దాఖు చేయగా నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కి విచారణకు వచ్చిందన్నారు. హైకోర్టు తమ వాదనలు అన్నీ విని ప్రభుత్వం నిర్ణయంపై స్టే ఇచ్చిందని తెలిపారు.

ఇటీవలే ఒకే రోజు హైకోర్టులో ఆరేడు కీలక అంశాలపై హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారులు అనాలోచితంగా, రాబోయే న్యాయపరమైన చిక్కులను పరిశీలించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వం ఇరుకున పడే పరిస్థితి ఏర్పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !