విజయనగరం, ఫిబ్రవరి 17: ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎటువంటి విబేధాలు లేవని కేంద్ర మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత అశోక్గజపతిరాజు అన్నారు.
చంద్రబాబుపై అలక వహించినట్లు వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు.
1982నుండి పార్టీ సిద్ధాంతాల కోసం పని చేస్తున్న కార్యకర్తనేనని అశోక్గజపతిరాజు అన్నారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్ష తరువాత టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు రాష్ట్రపతిని కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ, శుక్రవారం విశాఖపట్నం వెళ్లడానికి ఢిల్లీలో విమానం ఎక్కుతున్న సమయంలో పోలిట్బ్యూరో సమాచారం అందిందనీ, అప్పటికప్పుడు ప్రయాణం మార్చుకోలేక సమావేశానికి గైర్హజరు కావాల్సి వచ్చిందని అశోక్గజపతిరాజు వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు తెలియజేశానని ఆయన చెప్పారు.
కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ టిడిపిలోకి రావడం తన కిష్టంలేదనేది పుకారేననీ, ఆయన పార్టీలోకి రావడం స్వాగతిస్తానని అశోక్గజపతిరాజు తెలిపారు.