నీరవ్ మోడీ బ్యాంకులకు బురిడీ కొట్టేసిన స్కామ్ విలువ ఎంత..?! – పది వేల కోట్లు..!
విజయ్ మాల్యా వారు బ్యాంకులకు బురిడీ కొట్టేసిన స్కామ్ విలువ ఎంత..!? – తొమ్మిది వేల కోట్లు..! మరి మన రాయపాటి వారు బ్యాంకులకీ బురిడీ కొట్టేసిన స్కామ్ విలువ ఎంత..!? – 7926 కోట్లు..!!
కానీ ఇండియాలో అతి పెద్ద బ్యాంకు స్కామ్ రికార్డుల్లోకి మన రాయపాటి వారే ఎక్కబోతున్నారు. విజయ్ మాల్యా.., నీరవ్ మోడీలను మించబోతున్నారు. ఎలాగనగా..? వారికి ఉన్న నికర ఆస్తులు, బ్యాంకులకు తాకట్టు పెట్టిన ఆస్తులతో పోల్చి ఈ స్కామ్ విలువ తెలిస్తే రాయపాటి వారి విలువ ఎక్కువగా ఉంది. అంటే రాయపాటి వారి “ట్రాన్స్ ట్రాయ్” కంపెనీ ద్వారా ఈ బురిడీ మంత్రం వేశారు.
ఛేదనలో పడిన సీబీఐ..!!
ఈ రాయపాటి వారి కేసుని, బాగోతాన్ని సీబీఐ ఇప్పుడు ఛేదించే పనిలో ఉంది. రెండు రోజుల నుండి సీబీఐ రాయపాటి వారి ఇల్లు, ఆఫీసుల్లో, బంధువుల ఇళ్లల్లో సోదాలు చేసి.., కీలక ఆధారాలు సేకరించి.. క్రోడీకరించి.., మొత్తం కలిపి ప్రాధమిక అంచనా ప్రకారమే ఈ విలువ , ఇది ఇంకా పెరగొచ్చు కూడా.. అందుకే కంపెనీ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్లు రాయపాటి సాంబశివరావు, అక్కినేని సతీష్ లపై కేసు కూడా నమోదు చేసేసింది..! కెనరా బ్యాంకు నుండి కొన్ని ఫేక్ పత్రాలు పెట్టి రుణాలు తీసుకున్నారని.., కొన్ని పత్రాలు టాంపర్ చేశారని.., నకిలీ లెక్కలతో బురిడీ కొట్టించారని ఆరోపణ. ఇదే ట్రాన్స్ ట్రాయ్ కొన్ని అధరాలు, పత్రాలు చూపించి “పోలవరం” ప్రాజెక్టు పనులు దక్కించుకున్న సంగతి మర్చిపోకూడదు..!!
చంద్రబాబు మెడకు ఉందా..? లేదా..!?
రాయపాటి ఎవరు..? అనేక టీడీపీ “కమ్మ” సామజిక వర్గ నేతల్లో ఆయన కూడా ఒకరు మాత్రమే. సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు లాంటి వారికి మించి రాయపాటిపై ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. నాడు సుజనా పై కేసులు నమోదైన సమయంలో వెనుక చంద్రబాబు ఉన్నాడా..? లేదా అని లోతుకి వెళ్తే దొరకలేదు. మరి నేడు రాయపట్టి కేసులో చంద్రబాబు పాత్ర ఎంత వరకు ఉంది..? అనేది తేలాల్సి ఉంది. రాయపాటికి చంద్రబాబుకి దశాబ్దాల బంధం ఏమి లేదు. జస్ట్ రాష్ట్రంలో కాంగ్రెస్ చచ్చిపోయిన తర్వాత అంటే 2014 లో మాత్రమే రాయపాటి టీడీపీలోకి దూరారు. సో.., చంద్రబాబు పాత్ర దీనిలో ఉండకపోవచ్చు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏలూరు ఎంపీ కావూరి, రాయపాటి ఇద్దరూ ఈ విధంగా బ్యాంకుల నుండి లబ్ది పొందారు అనే ఆరోపణలు వినిపించాయి. సీబీఐ మరింత లోతుకి వెళ్లిన తర్వాత రాయపాటి సినిమా ఎక్కడ వరకు వెళ్తుందో తేలుతుంది. ఒక నీరవ్, ఒక విజయ్ మాల్యా లాగా ఈయన విదేశాలు పారిపోలేదు.. కాకపోతే సుజనా లాగా కాషాయ గొడుగు కప్పుకోడానికి మాత్రం వెనుకాడే అవకాశాలు లేవు. ఏమో.. కాషాయం కప్పడం కోసమే ఈ కేసులేమో..!!?