Janasena Bjp: బీజేపీ–జనసేన మైత్రి ఏపీలో ‘నోటితో పొగుడుతూ నొసటితో వెక్కిరింపు’ చందాన ఉందంటే అతిశయోక్తి కాదేమో. జరుగుతున్న పరిణామాలు ఇదే చెప్తున్నాయి. మైత్రి అంటే.. రాష్ట్రంలో చేపట్టే పనుల్లో ఇద్దరి భాగస్వామ్యం ఉండటం ఎంతో ముఖ్యం. కానీ.. ఎన్నికల సమయంలో తప్పితే ఇద్దరూ ఒక్కతాటిపై నడుస్తుంది లేదనే చెప్పాలి. పవన్ కల్యాణ్ఆ ( Pavan Kalyan ) మధ్య.. ఏపీ బీజేపీపై వ్యాఖ్యలు చేయగానే.. అధిష్టానం అక్షింతలతో మరునాడే బొకేతో పవన్ ఇంటి దగ్గర తేలారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఉప ఎన్నికల్లో కలిసే ప్రచారం చేశారు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి వారు తమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే చెప్పాలి.
Janasena Bjp: బీజేపీ సొంతంగానే వెళ్తోందా..
తెలంగాణతో పోలిస్తే ఏపీలో బీజేపీకి ప్రాభవం తక్కువ. 2024 ఎన్నికలు లక్ష్యంగా పనిచేసి ఇప్పటి నుంచే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంది. అయితే.. ఈ పని మాత్రమే కాకుండా ‘మేము అధికారంలోకి వస్తే..’ అని ఈమధ్య సోము వీర్రాజు అంటున్నారు. అది జనసేనతో కలిసా.. సొంతంగానా అనేది క్లారిటీ లేదు. దీంతో బీజేపీ స్వయంగా రంగంలోకి వెళ్తోందని సమావేశాలు ఉదహరిస్తున్నాయి. అటు జనసేన కూడా బీజేపీ ప్రస్తావన లేకుండా తన కార్యకలాపాలు చేస్తోంది. ఇప్పటికే జనసేన పొత్తుల పార్టీగా ముద్రపడిపోవడంతో జనసైనికులకు తమ పార్టీ మరే పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. కానీ.. అధినేత మాటకు కట్టుబడే ఉంటున్నారు. కానీ.. వాస్తవ పరిస్థితులు మాత్రం వేరుగా ఉంటున్నాయి. అయితే.. అధినాయకత్వాలు మాత్రం ఎక్కడా తమ మైత్రిపై ఎటువంటి వ్యాఖ్యలకు అవకాశం ఇవ్వకుండా తమ పని తాము చేసుకుంటున్నాయి.
సోము వ్యాఖ్యలపై పపన్ స్పందనేంటో..
రీసెంట్ గా సోము వీర్రాజు 75కే లిక్కర్ అంటూ చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్టను దెబ్బ తీశాయనే చెప్పాలి. ఈ వ్యాఖ్యల ద్వారా మిత్రపక్షమైన జనసేనకు కూడా ఇబ్బందే. వాళ్లకి తెలిసే సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారా..? పవన్ ఇందుకు ఒప్పుకుంటారా..? ఇవన్నీ వీరిద్దరి మైత్రిపై ప్రశ్నలు రేకెత్తించేవే. ఇటివల ప్రజాగ్రహ సభల్లో కూడా ఎక్కడా తాము రెండు పార్టీలు కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పిన దాఖలాలు లేవు. మరి.. భవిష్యత్తులో జనసేన–బీజేపీ తమ వైఖరిని ఎలా చెప్పుకొస్తాయో చూడాలి.