అమరావతి: బిజెపి సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యడ్లపాటి రఘునాథ బాబుకు కీలక పదవి లభించింది.
పొగాకు బోర్డు చైర్మన్ గా ఆయన్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రఘునాథ బాబును చైర్మన్ గా నియమిస్తూ కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మహేందర్ చౌదరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రఘునాథబాబు ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు.
గత కొంతకాలంగా పొగాకు బోర్డుకు చైర్మన్ లేరు. ఈ నేపథ్యంలో పొగాకు బోర్డు చైర్మన్ గా ఇన్ చార్జి చైర్మన్ కె సునీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రెండు రోజుల్లో రఘునాథబాబు బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!