హైదరాబాద్, మార్చి 8 : కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి వైసిపిలో చేరారు. లోటస్పాండ్లో శుక్రవారం వైసిపి అధినేత జగన్ సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
చల్లా సోమవారం టిడిపికి గుడ్ బై చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి, పదవికి రాజీమానా చేస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబుకు పంపిన లేఖలో పేర్కొన్నారు.
చల్లా రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి కర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక పర్యాయం, కోయలకుంట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి పిఆర్పి అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.