విజయవాడ, మార్చి, తెలంగాణలో మాదిరిగా ఆంధ్రలోనూ టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించి ఎన్నికల్లో లబ్దిపొందాలని చూస్తున్నారని సినీనటుడు శివాజి ఆరోపించారు.
విజయవాడలో శుక్రవారం ఆయన మిడియాతో మాట్లాడారు.
తెలంగాణలో ఎన్నికలకు ముందు భారీగా జరిగిన ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి ఫిర్యాదు చేసినా ఈసి పట్టించుకోలేదని శివాజి అన్నారు.
రాష్ట్రంలో వైసిపిని గెలిపించేందుకు కెసిఆర్ అదే తరహాలో చేయాలని చూస్తున్నారని శివాజీ ఆరోపించారు.
ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే ఐటీ గ్రిడ్స్ కేసు తెరపైకి తెచ్చారని శివాజీ అన్నారు.
ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా కెసిఆర్ పనిచేస్తున్నారని శివాజీ విమర్శించారు.
కెసిఆర్కు కేంద్రం సహకరిస్తుందని శివాజీ ఆరోపించారు.
రెండు ప్రభుత్వాలు సిట్లు వేయడం ద్వారా ఏం సాధిస్తాయని శివాజీ ప్రశ్నించారు.
ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఇదంతా చేస్తున్నారని శివాజి ఆరోపించారు.
ఏపీ పోలీసులు తెలంగాణకు రావొద్దనడానికి కెటిఆర్ ఎవరని శివాజి ప్రశ్నించారు.
రాజ్యాంగంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని శివాజి గుర్తు చేశారు.
ఏపీ సర్కారు తప్పు చేస్తే కేంద్ర సంస్థలతో దర్యాప్తును చేయించాలని శివాజీ సూచించారు.