ఒకానొక సమయంలో ఏపీలో బీసీ వర్గాలు టిడిపి పార్టీకి వెన్నెముకగా ఉండేవి. చాలావరకు బీసీ ఓట్ బ్యాంక్ టీడీపీకి మద్దతు అన్న తరహాలో రాజకీయం ఉండేది. కాగా ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ చాలా వరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీసీ వర్గాలకు మేలు చేసే రీతిలో ఉండటంతో … బీసీ వర్గాల ఆలోచనలలో మార్పు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. గత టీడీపీ హయాంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో లబ్ధి పొందని విధంగా జగన్ ఏడాదిన్నర పరిపాలనలోనే అనేక లాభాలు పొందటం జరిగిందని బీసీ వర్గాల లో టాక్ నడుస్తుంది అంట.
ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు చాలా మంది బీసీ నేతలకు పదవులు కల్పించడంతో బీసీలు వైసీపీ పార్టీకి ఆకర్షితులవుతున్నారు. గత టిడిపి ప్రభుత్వంలో మాత్రమేకాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పాలించిన పరిపాలకుల కంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ వర్గాలకు చాలా మేలు జరిగినట్లు భావిస్తున్నారు అని సమాచారం. ఇదే తరహాలో రాబోయే రోజుల్లో జగన్ ఈ విధంగానే పథకాల అమలు చేసుకుంటూ పోతే… టిడిపికి అండగా ఉండే బిసి ఓటు బ్యాంక్ వైసిపి వైపు టర్న్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటికే వైసీపీ పార్టీకి దళితులు మైనార్టీల సపోర్ట్ ముందునుండి ఉంది. ఇక రానున్న రోజుల్లో బీసీలు కూడా తోడైతే ఏపీలో జగన్ పార్టీకి తిరుగుండదని చెప్పుకొస్తున్నారు. ఈ పరిణామంతో మిగతా పార్టీలు ఏపీలో అడ్రస్ ఉండవని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా అధికారంలోకి వచ్చిన జగన్ చాలా వరకు టిడిపి పార్టీకి సపోర్ట్ గా ఉండే ఓటు బ్యాంకు ని టార్గెట్ చేస్తూ సంక్షేమ పథకాలు అందిస్తూ… కోలుకోలేని దెబ్బ తన పరిపాలన తో వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ వర్గాలను కాపాడుకోవటం కోసం.. ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు టాక్. అందువల్లే రాబోయే రోజుల్లో టిడిపి పార్టీ భవిష్యత్తు అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన ఓ నాయకుడికి పగ్గాలు అప్పజెప్పే ఆలోచనలో బాబు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.