హైదరాబాద్: మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు శనివారం టిఆర్ఎస్లో చేరారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ మండవకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
నిన్న జూబ్లీహిల్స్లోని మండవ నివాసానికి స్వయంగా వెళ్లిన కేసిఆర్.. ఆయనను టిఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం కేసిఆర్ వెంటే ప్రగతిభవన్కు వచ్చిన మండవ పార్టీ మారేందుకు సుముఖత వ్యక్తంచేశారు. ఈ క్రమంలో ఇవాళ గులాబీ కండువా కప్పుకున్నారు.
మండవ డిచ్పల్లి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు, నిజామాబాద్ (రూరల్) నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు.
కాంగ్రెస్ నేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) కూడా ఈరోజు టిఆర్ఎస్లో చేరారు. గాయత్రి రవి 2018 ఎన్నికల్లో వరంగల్ (తూర్పు) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.