అమరావతి, జనవరి 19: జగన్పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటీషన్ను హైకోర్టు తిరస్కరించింది.
విశాఖ ఎయిర్ పోర్టు లాంచ్లో ప్రతిపక్ష నాయకులు, వైసిపి అధినేత జగన్మోహనరెడ్డిపై శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ప్రభుత్వం సిట్ అధికారులకు అప్పగించింది. తమకు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థతో నమ్మకం లేదని, కేసును జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వైసిపి నాయకులు కేంద్రానికి లేఖ రాయడంతో పాటు హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు ఆదేశాలతో ఈ కేసును ఎన్ఐఎకి అప్పగించారు.
ఎన్ఐఎ అధికారులు ఇప్పటికే కోర్టు అనుమతితో శ్రీనివాసరావును అదుపులోకి ఆరు రోజుల పాటు విచారణ జరిపారు.
ఈ కేసును ఎన్ఐఎకి అప్పగించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టిడిపి నాయకులు వ్యతిరేకిస్తూ వచ్చారు.
శనివారం ప్రభుత్వం తరపున హైకోర్టులో హౌస్మోషన్ పిటీషన్ దాఖలు చేయగా, ఆత్యవసరంగా విచారించాల్సిన పిటిషన్ కాదని న్యాయమూర్తి తిరస్కరించారు.