ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అందరి చూపు స్థానిక సంస్థల ఎన్నికల పైనే. కరోనా కంటే అందరి దృష్టి ఇప్పుడు దాని కారణంగా వాయిదా పడిన ఎన్నికల గురించి. అయితే, ఇందులో కీలక పరిణామం చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది.
కరోనా కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఈనెల 28 వ తేదీన రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల కమిషన్ సమావేశం కాబోతోంది.
లాక్ డౌన్ కారణంగా….
ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ, మార్చి 22 నుంచి దేశంలో లాక్ డౌన్ అమలు కావడంతో ఎన్నికల నిర్వహణ వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి దేశం కోలుకుంటోంది. కంటైన్మెంట్ జోన్ల మినహా అన్ని ప్రాంతాల్లో జనజీవనం దాదాపుగా సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఈనెల 28 వ తేదీన రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కాబోతోంది.
ఇవాళే ఈసీ సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రధాన పార్టీల సమావేశం తీసుకోవడంలో భాగంగా ఉదయం 10:30 గంటలకు ఎస్ఈసి ఆఫీస్లో సమావేవం జరగనుంది. ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధికి ఆహ్వానం పంపారు. హాజరైన ప్రతినిధితులతో ఎస్ఈసి విడివిడిగా సమావేశం అవుతుంది. పార్టీల అభిప్రాయాలను రాతపూర్వకంగా ఇవ్వాలని పార్టీలను కోరింది. పార్టీలు ఎలాంటి అభిప్రాయం చెప్తాయి ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
హైకోర్టులో కీలక వ్యాఖ్యలు
స్థానిక ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్ను విచారించిన ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని.. కోర్టు ప్రశ్నించగా కరోనా ఉధృతివల్ల ఇప్పుడు సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పింది. అదే మాటను ఈసీకి చెప్పాలని సూచించి హైకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై అభిప్రాయం తెలపాలంటూ ఎస్ఈసీకి నోటీసులు జారీ చేసిన కోర్టు.. తదుపరి విచారణ నవంబరు 2కి వాయిదా వేసింది.