హైదరాబాదు: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి వి హనుమంతరావుతో గొడవ పడిన గ్రేటర్ హైదరాబాదు కాంగ్రెస్ నేత నగేష్ ముదిరాజ్పై పార్టీ అధష్టానం వేటు వేసింది.
రెండు రోజుల క్రితం ఇందిరా పార్క్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వేదికపై కుర్చీలో కూర్చునే విషయంపై సీనియర్ నేత వి హనుమంతరావు, నగేష్ మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తోపులాటలో వి హనుమంతరావు కిందపడ్డారు. ఈ ఘటనపై పార్టీ అధిష్టానం తీవ్రంగా స్పందించింది.
పార్టీ క్రమశిక్షణా సంఘం నగేష్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై నగేష్ గాంధీ భవన్ వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. తనను అన్యాయంగా పార్టీ నుండి సస్పెండ్ చేశారని నగేష్ ఆరోపించారు. తన సస్పెన్షన్పై కోర్టును ఆశ్రయిస్తానని నగేష్ పేర్కొన్నారు.