దాదాపు పది సంవత్సరాలు అనేక ఆటుపోట్లను ఎదుర్కొని 2019 సార్వత్రిక ఎన్నికలలో అనుకున్న ముఖ్యమంత్రి పదవిని జగన్ సాధించడం జరిగింది. 2014 ఎన్నికలలో నే దాదాపు విజయం గ్యారెంటీ అనుకున్నా వైఎస్ జగన్ కి కొద్దిపాటి తేడాతో సీఎం కుర్చీ దూరమైంది. దీంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు…. ఇక జగన్ ని పొలిటికల్ గా ఫినిష్ చేయడం గ్యారెంటీ అని భావించారు. కాని పరిస్థితి చూస్తే పూర్తిగా 2019 సార్వత్రిక ఎన్నికలకు మారిపోయింది.
ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పై రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక తీసుకురావటంలో అదేవిధంగా ఎన్డీయేకు, పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు ని దూరం చేయడంలో జగన్ సక్సెస్ సాధించి…. 2019 ఎన్నికలలో ఎవరు ఊహించని విధంగా దాదాపు 51 పర్సంటేజ్ ఓటింగ్ తో ఘన విజయం సాధించడం జరిగింది. కాగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మేనిఫెస్టోలో ఉంచిన హామీలను నెరవేర్చడమే కాకుండా మరిన్ని కొత్త పథకాలు ప్రజలకు అందించారు.
ఇదిలా ఉండగా మళ్లీ జగన్ అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా విజయం సాధించాలంటే ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను…. పూర్తిచేయాలనే టాక్ వస్తోంది. మరోపక్క వైయస్ జగన్ కూడా తాజాగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఒక అంచనాకు వచ్చినట్లు వీటి నిర్మాణం కోసం దాదాపు ఐదు సంవత్సరాలలో 96,550 కోట్ల వ్యయం ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు టాక్ వస్తుంది.
ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. దాదాపు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేసి ఇ వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టడానికి జగన్ రానున్న సంవత్సరాల్లో…. ప్రణాళిక బద్ధంగా సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి వచ్చే ఎన్నికల నాటికి ప్రజల మెప్పు పొందటానికి గెలవడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.