వైసీపీ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం న్యాయస్థానాల ను ఆధారం చేసుకుని పొలిటికల్ గేమ్ ఆడుతున్నట్లు ఏపీ రాజకీయాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే ప్రతి విషయంలో జగన్ ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ…అక్కడ మొట్టికాయలు వేయించుకుంటూ వస్తోంది. హైకోర్టులో సుప్రీంకోర్టులో జగన్ తీసుకున్న చాలా ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు దాదాపు 70 కి పైగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో వైసీపీ ప్రభుత్వానికి అసలు సిసలైన ప్రతిపక్షం న్యాయస్థానాలు అనే ముద్ర ప్రజలలో నెలకొంది.
ఇటువంటి తరుణంలో కోర్ట్ లో వేసే పిటిషన్ కి వ్యతిరేకమైన తీర్పు వస్తుందని తెలిసి కూడా కావాలని జగన్ సర్కార్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూన్నట్లు…. ఆ విధంగా వ్యతిరేకమైన తీర్పు వచ్చాక సానుభూతి సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజాగా సరికొత్త వార్త ఏపీ పాలిటిక్స్ లో చక్కర్లు కొడుతుంది. జనంలో సింపతి సంపాదించడానికి ఆయా కేసుల్లో న్యాయస్థానంలో వ్యతిరేకమైన తీర్పు వస్తుందని తెలిసి కూడా ఏపీ ప్రభుత్వం పిటిషన్ లు వేసి మరి మొట్టికాయలు వేయించుకుంటున్నట్లు తేలింది.
చివరిలో సరిగ్గా ఎన్నికల సమయంలో కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులను ఆధారం చేసుకుని సానుభూతి పాలిటిక్స్ చేయాలనే భావనలో జగన్ సర్కారు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందువలనే ఓడిపోతాము అని తెలిసి కూడా ఏపీ ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కుతున్నట్లు టాక్. ముఖ్యంగా మూడు రాజధానులు విషయంలో మంకు పట్టు పట్టి జగన్ సర్కార్ న్యాయస్థానంలో పోరాడటం వెనకాల అతిపెద్ద పొలిటికల్ స్ట్రాటజీ అన్నట్లు వైసిపి పార్టీ లో టాక్ వినబడుతోంది.
ఒక విధంగా చూస్తే రాజధాని వ్యవహారంలో టిడిపిని అమరావతి రాజధాని ప్రాంతంలో 29 గ్రామాలకు పరిమితం చేసేలా…. మిగతా ప్రాంతాలలో వైసిపికి పొలిటికల్ మైలేజ్ వచ్చేలా జగన్ వ్యవహరిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. చాలావరకూ మూడు రాజధానులు విషయంలో రాజధాని ప్రాంత రైతులు కోర్టులో పిటిషన్లు వేసిన… వాళ్ళ వెనకాల టిడిపి పార్టీ ఉందన్న భావన మిగతా ప్రాంతాల్లో నెలకొంది అని ఏపీ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో సరిగ్గా వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయంలో టిడిపి అదేవిధంగా అమరావతి కి సపోర్ట్ చేసిన పార్టీలు మిగతా చోట్ల రాజధాని రాకుండా అడ్డుకోవడానికి న్యాయస్థానాల్లో కేసులు వేశారని జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడం గ్యారెంటీ అని మేధావులు అంటున్నారు.
ఈ దెబ్బతో విపక్షాలు చాలావరకు అమరావతి ప్రాంతానికే పరిమితమై మిగతా చోట్ల దెబ్బతినటం గ్యారెంటీ అని విశ్లేషిస్తున్నారు. అదే రీతిలో పేదల ఇళ్ల పట్టాల విషయంలో కూడా ఈ రకమైన స్టాండ్ తోనే జగన్ సర్కార్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నట్లు టాక్ వస్తోంది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడుతూ ప్రస్తుతం వస్తున్న, ఇది… వచ్చే ఎన్నికల వరకు కొనసాగిన ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.