NewsOrbit
రాజ‌కీయాలు

జూలై 22 ముహూర్తం ఫిక్స్..

 

జగన్ క్యాబినెట్ లో రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నిక కావడంతో వారు ఎమ్మెల్సీ పదవులకు దాంతో పాటు మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఎమ్మెల్సీల రాజీనామాను ఆమోదించారు. ఇక మంత్రి పదవి కూడా ఆమోదించినున్నారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులు ఎవరు అనేది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో జగన్మోహన రెడ్డి ఈ సారి ఆ సామాజిక వర్గానికే ఇస్తారా? వేరే సామాజిక వర్గానికి కేటాయిస్తారా? ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పిస్తారా? మైనార్టీ లకు కేటాయిస్తారా? అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే తాజాగా వీటిపై అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ రెండు మంత్రి పదవులను మళ్లీ బీసీలకే ఇవ్వాలి అని జగన్మోహన రెడ్డి భావిస్తున్నారట.

ఎలాగూ మరో ఏడాదిన్నరలో అంటే ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసినప్పుడే జగన్మోహన రెడ్డి రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని, 90శాతం మంత్రులను మారుస్తామని చెప్పారు. సో.. ఇప్పుడు కొత్తగా ఇద్దరు మంత్రులను తీసుకున్నప్పటికీ మరో ఏడాదిన్నర తర్వాత లేదా ఏడాది తరువాత మంత్రివర్గ ప్రక్షాళన తప్పదు. ఇప్పుడున్న ఆశావహుల జాబితాను తీసుకొని కొత్తగా వేరే సామాజికవర్గానికి ఇచ్చి ఇతర సామాజిక వర్గాల నుంచి విమర్శలు, ఆరోపణలు, అలకలు ఎదుర్కునేకంటే బీసీ సామజిక వర్గం నుండి ఇద్దరు దూరం అయిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిని తీసుకుంటే ఎటువంటి రిస్క్ ఉండదని, ఎటువంటి ప్రశ్నలు తలెత్తవని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఆ పార్టీకి అనుకూల మీడియా అయిన సాక్షిలో కూడా దీన్నే ప్రస్తావిస్తూ ఈ రోజు ఒక కధనం వచ్చింది. దీనిని పరిశీలించిన సరే ఒక రకంగా కేబినెట్లోకి బీసీ వాళ్లనే తీసుకుంటారని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లే.

అయితే ఇప్పటికే ఆశావహుల జాబితాలో చాలా మంది ఉన్నారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి, రోజా, ఆనం రామనారాయణ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, అనంత వెంకట్రామిరెడ్డి ఇలా అనేక మంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు అయితే ఈ ఆశావహులు అందరికీ కూడా మరో ఏడాది, ఏడాదిన్నర వేచి చూడండి అని జగన్ తరఫున వైసీపీ పెద్దలు కబురు పెట్టినట్టు తెలిసింది. అందుకే బీసీల్లో ఎవరు చురుగ్గా ఉన్నారో చూసుకొని వారిలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వనున్నారు. ఇదే నేపథ్యంలో జిల్లాల వారీగా చూసుకున్నా ఇప్పుడు రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులలో ఒకరు గుంటూరు జిల్లా, మరొకరు తూర్పు గోదావరి జిల్లా కావడంతో ఆ జిల్లాలకు కోటా తగ్గకుండా ఈ జిల్లాలోనే వేరే ఎమ్మెల్యేలు తీసుకుంటారా లేదా పక్క జిల్లాలకు వెళతారా అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికి మంత్రివర్గ కూర్పు అంటే సామాజిక వర్గాలు, ప్రాంతాలు, జిల్లాలు వీటన్నిటిని సున్నితమైన అంశాలను పరిగణలోకి తీసుకొని చేసుకోవాల్సి ఉంది. తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గ కూర్పు విషయంలో ఆచితూచి ముందడుగు వేశారు. అన్ని సామాజిక వర్గాలకు మిళితం చేసి విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకున్నారు. అటువంటి భావన కోల్పోకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు బీసీల నుంచే కొత్త మంత్రులను తీసుకోవాలనే ఆలోచనలో ఉంటూనే ప్రాంతాల మధ్య విద్వేషాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది.

Related posts

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju