గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 17 వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకుగాను జూలై నెలాఖరులో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.గ్రామ సచివాలయాలలో 14000′ వార్డు సచివాలయాల్లో 2500 పోస్టులు ఉన్నాయి.దాదాపు 11 లక్షల మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు జనవరి నెలలో నోటిఫికేషన్ వెలువడగా మార్చిలో పరీక్షలు నిర్వహించ తలపెట్టారు. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా ఇవి వాయిదా పడుతూ వచ్చాయి.
ప్రస్తుతం పరిస్థితులు కాస్తంత అనుకూలంగా మారడంతో ఈ పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 14 రకాల పరీక్షలు నిర్వహించడం ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. జూలై నెలలోనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు ఉండగా అవి వీటికి అడ్డం రాకుండా ఉండేవిధంగా షెడ్యూలు నిర్ణయించబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.నిరుద్యోగులకిది నిజంగా శుభవార్త.