అమరావతి, ఏప్రిల్ 17: వైసిపి నాయకులు స్పీకర్ కోడెల శివప్రసాద్పై దాడి చేస్తే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి గవర్నర్ను కలిసి అన్నీ అబద్దాలే చెప్పారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ సాయంత్రమే జగన్ తన ఓటమిని అంగీకరించారని ఉమా అన్నారు. కౌంటింగ్ వరకు క్యాడర్ను కాపాడుకునేందుకు జగన్ తంటాలు పడుతున్నారని ఉమా ఎద్దేవా చేశారు. కోడెల శివప్రసాద్పై దాడి గురించి మాట్లాడుతూ చొక్కాలను చించుకునే సంస్కృతి జగన్దేనని ఉమా విమర్శించారు.
రాష్ట్రాన్ని మళ్లీ పాలించేది తెలుగుదేశమేనని ఉమా ధీమా వ్యక్తం చేస్తూ చంచల్గూడ జైలుకా లేక చర్లపల్లి జైలుకా అనేది జగన్ తేల్చుకోవాలని ఉమా ఉన్నారు. ప్రతిపక్ష హోదా కూడా వైసిపికి వచ్చే పరిస్థితి లేదని ఉమా జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐవిఎస్ అధికారులను ఇష్టానుసారంగా మారిస్తే విశ్రాంత అధికారులు ఏమైపోయారని ఉమా ప్రశ్నించారు.
ఎన్నికల పలితాలు చూసి తట్టుకునేందుకు జగన్ సిద్ధంగా లేరనీ, ఆయన మానసిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఉమా అన్నారు. ఫైనల్ పేమెంట్ తీసుకున్న ప్రశాంత్ కిషోర్ జగన్ చేతిలో సిఎం అనే నేమ్ ప్లేట్ పెట్టి వెళ్లిపోయాడని ఉమా విమర్శించారు.