Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకరరెడ్డి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డిలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయా పార్టీల నేతలు ప్రచారంలో పాల్గొంటూ ప్రత్యర్ధులపై మాటల దాడి చేస్తున్నారు. బీజేపీ అభ్యర్ది ఒక్క రాజగోపాల్ ను ఓడించడానికి అధికార టీఆర్ఎస్ 80 మంది ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ ఇలా అందరూ రంగంలోకి దిగారని దిగారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ పై విమర్శలు సంధిస్తున్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం పనిచేసే హీరో… మిగిలిన పార్టీ అభ్యర్థులు ప్రజలను ఇబ్బంది పెట్టే విలన్లు… మరి హీరో కావాలా? విలన్లు కావాలా? ఆలోచించాలి అంటూ సంజయ్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నేత మంత్రి కేటిఆర్ ..మీడియాతో చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ డ్రామాలు స్టార్ట్ చేస్తుందని ప్రజలు అలర్ట్ గా ఉండాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతికి కట్టుతో త్వరలో మీ ముందుకు వస్తారనీ, కాని వాటిని ప్రజలు నమ్మవద్దని కేటిఆర్ అన్నారు. హూజూరాబాద్, దుబ్బాకలో ఆడిన డ్రామాలనే మునుగోడులోనూ చేయడానికి ప్రయత్నిస్తుందని మంత్రి కేటిఆర్ తెలిపారు.ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలకు తెరలేపుతుందని ఆయన తెలిపారు. అందులో భాగంగానే గాయం అయ్యిందని కట్టుతో కనిపించి సానుభూతి పొందే ప్రయత్నాలు కూడా త్వరలో జరుగుతాయని ప్రజలు వాటిని నమ్మవద్దని కేటిఆర్ కోరారు. ఎన్ని కుట్రలు చేసినా చివరకు ప్రజలు టీఆర్ఎస్ పక్షానే నిలుస్తారని కేటిఆర్ అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి రెడ్డి తరపున టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇటు టీఆర్ఎస్, బీజేపీలను ఆయన తీవ్రంగా విమర్శిస్తూ కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించాలని కోరుతున్నారు.
Munugode Bypoll: నల్గొండ జిల్లాలో భారీగా నగదు పట్టివేత.. సాగర్ హైవే ఓ కారులో ఎంత నగదు దొరికిందంటే..?