Perni Nani : నిమ్మగడ్డ పదవీకాలం ముగియటంతో ఈరోజు ఉదయం మీడియా సమావేశం నిర్వహించి అనేక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి తరుణంలో సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ..తాజాగా నిమ్మగడ్డ వ్యవహరించిన తీరుపై సీరియస్ కామెంట్లు చేశారు. గవర్నర్ కి ఆయన లేఖ రాయడం పట్ల స్పందిస్తూ ..నిమ్మగడ్డ శ్రీరంగనీతులు లెటర్ విడుదల చేశారని ఓ పచ్చి తిరుగుబోతు బ్రహ్మచర్యం గురించి మాట్లాడినట్లు ఉంది అన్నట్టు కామెంట్ చేశారు. మిగతా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనే నిమ్మగడ్డ లెటర్ రాయడం విచిత్రంగా ఉందని అన్నారు. భారీ తగ్గింపు మరియు నిర్లక్ష్య వ్యవహారశైలి నిమ్మగడ్డ కి సొంతం అంటూ సెటైర్లు వేశారు.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్యంగా హోటల్లో సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్ వంటి రాజకీయ నాయకులతో మంతనాలు అప్పట్లో జరిపి..రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజకీయ నాయకుల తో దూరంగా ఉండాలని ఇప్పుడు ఆయన మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు, సిగ్గుమాలిన చర్య అని అభివర్ణించారు. నిమ్మగడ్డ పదవి కాలంలో ఉన్నంత కాలం అడుగడుగున చంద్రబాబు ప్రయోజనాల కోసం పని చేశారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తయారైన లెటర్ పై సంతకం పెట్టి కేంద్రానికి లెటర్ రాసిన వ్యక్తి నిమ్మగడ్డ అంటూ మండిపడ్డారు.
ఇంకా అనేక విషయాల పై నిమ్మగడ్డ పై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో..విభజనకు గురయి మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ఎస్ఈసీ గా ఎన్నికైన వ్యక్తి నిమ్మగడ్డ. ఆయన తీసుకున్న ఆలోచనలు చాలావరకూ ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ ని ఇరకాటంలో పెట్టడం జరిగాయి. ముఖ్యంగా స్థానిక ఎన్నికలు అనే ఎపిసోడ్ ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పటినుండి నిమ్మగడ్డ వర్సెస్ వైసిపి పార్టీ అన్నట్టు ఏపీ రాజకీయాలు జరిగాయి. ఏదిఏమైనా నిమ్మగడ్డ పదవి కాలం చివరి రోజు కూడా వైసీపీ నేతల చేత విమర్శలు చేయించుకోవటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.