R.Narayanamurthy: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో రైతులు ఆందోళనలు నిర్వహించడం జరిగింది. చలో రాజ్ భవన్ పేరిట జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో రాజ్ భవన్ లోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం మాత్రమే కాక ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా అరెస్టయిన ఆందోళనకారుల లో ఆర్ నారాయణ మూర్తి ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు అనేక ఇబ్బందులు గురి చేసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. బీహార్ రాష్ట్రంలో ఇదే రీతిలో 2006వ సంవత్సరంలో కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు.. కానీ ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో రైతాంగం లేకుండా పోయిందని విమర్శించారు. అక్కడ అంతా రైతు లే ఇప్పుడు కూలీలుగా మారారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఆర్.నారాయణమూర్తి స్పష్టం చేశారు.