అనంతపురం జిల్లా తాడిపత్రి లో మొన్న జరిగిన రచ్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. వైసిపి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టిడిపి మాజీ ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి దాడి చేయడం అక్కడ తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటు చేసుకోవడం అందరికీ తెలిసిందే. ఇక ఆ ఉద్రిక్తత ఇప్పటికి తగ్గలేదు. దీంతో తాడిపత్రి కేంద్రంగా హైటెన్షన్ నెలకొంది. మామూలుగానే తాడిపత్రిలో రాజకీయాలు వేడిగా ఉంటాయి. ఇంత పెద్ద గొడవ జరిగిన తర్వాత రెండో రోజు కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి పరిసరాలు అయితే కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పోలీసులు కంటే అతని అనుచరులు ఎక్కువగా మోహరించి కాపలా కాస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో ఆ ప్రాంతంపై పోలీసులు నిఘా పెట్టారు. ఇక ఇటువంటి ఎన్నో వివాదాలు ఆరితేరిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద అయితే అదనంగా సీసీటీవీ కెమెరాల అమరుస్తున్నారు. ఇలాంటి రాజకీయ దాడులు ఎంత వరకు వెళతాయి అన్నది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం జేసీ దాడి జరిగిన ఇంటిలోనే ఉన్నారు.
అధికార ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి దగ్గర కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది అక్కడ కూడా గట్టి స్థాయిలో పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన కూడా ప్రస్తుతానికి తన ఇంట్లోనే ఉన్నారు. దాడులు, ప్రతి దాడులు జరిగిపోవడం పలువురికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడ హై అలర్ట్ నెలకొంది .ఇక ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే పెద్ద రెడ్డి ఇంటికి సమీపంలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు ఉంది. కాబట్టి పోలీసులు అక్కడ పెద్ద స్థాయిలో మొహరించారు. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇలాంటి సమయంలో అతని అనుచరులు ఇటు వచ్చినాం… ఇతని అనుచరులు అటు వెళ్ళినా పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇక ఈ వేడి తాడిపత్రిలో తగ్గి ప్రశాంత వాతావరణం ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేకున్నారు.