బ్రిటన్లో రూపాంతరం చెంది కనుగొనబడిన కొత్తరకం కరోనా వైరస్ అందరినీ భయపెడుతుంది. వైరస్ ఇప్పటికే పలు ప్రపంచ దేశాలకు పాకి పోయింది. అన్న విషయం తెలిసిందే. ఇక ఈ కొత్త రకం కరోనా వైరస్ ఎఫెక్ట్ భారత్ కు కూడా తగిలింది. ఇంకా చెప్పాలంటే తెలంగాణకు కూడా దీని ఎఫెక్ట్ పడింది. తాజాగా బ్రిటన్ నుండి 16 మంది తెలంగాణ రాష్ట్రం లోనికి వచ్చినట్లు… రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఈ క్రమంలో తగిన చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసిన తర్వాత విదేశాల నుండి వస్తున్న వారిని పట్టించుకోవడం లేదు …అయితే ఇప్పుడు కొత్తగా మరో రకమైన వైరస్ వస్తున్న నేపథ్యంలో వీరి ముందు ఒకటే ఆప్షన్ ఉన్నట్లు కనిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే బ్రిటన్ నుండి వచ్చిన వారి వివరాలను సేకరించి వారికి అన్ని టెస్టులు నిర్వహిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు పన్నెండు వందల మంది బ్రిటన్ నుండి తెలంగాణకు వచ్చారు. అని వీరిలో 926 మందిని ఇప్పటికీ గుర్తించామని అందులో 16 మంది కి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిలో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా నుండి నలుగురు, జగిత్యాల నుండి ముగ్గురు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్ నుండి నాలుగు పాజిటివ్ కేసులు బయటపడ్డాయని తెలిపారు.
ఒకవేళ వీరిలో ఎవరికైనా కొత్త రకం కరోనా వైరస్ సోకి ఉంటే అది వ్యాపించకుండా ఉండేందుకు 3 టీ పద్ధతిని పాటిస్తున్నారు. 16 మందిని ఆస్పత్రిలో ప్రత్యేక వార్డుల్లో ఉంచుతారు. ఇక వీరితో సన్నిహితంగా ఉండే వారిని గుర్తించి.. వారందరిలో ఉన్న వైరస్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఫలితాలు 12 రోజుల్లో వచ్చేస్తాయి. ప్రస్తుతానికి 16 మందికి 76 మంది సన్నిహితంగా ఉన్నారని గుర్తించారు.
రిజల్ట్ వచ్చిన తర్వాత అందుకు తగ్గట్లు ట్రీట్మెంట్ మొదలుపెడతారు. ఇక నుండి యుకే నుండి లేదా యూకే గుండా ప్రయాణించి వచ్చిన వారు దయచేసి వివరాలను క్రింది ఫోన్ నెంబర్లకు వాట్స్ఆప్ లేదా ఫోన్ చేసి తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సిబ్బంది వారి ఇంటికి వెళ్లి మరీ వైద్య పరీక్షలు చేస్తామని కూడా అధికారులు హామీ ఇచ్చారు.
ఫోన్ – 040-24651119
వాట్సాప్ – 9154170960