న్యూఢిల్లీ: టిడిపి ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీలో ఎన్నికల కమిషన్ను కలిసి ఫారం 7 ద్వారా పెద్ద ఎత్తున ‘వోట్ల తొలగింపు కోసం జరిగిన కుట్ర’పై ఫిర్యాదు చేసింది. మంత్రులు కాలువ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, ఎంపి కనకమేడల, కంభంపాటి రామ్మోహన రావు ఎన్నికల కమిషన్ను కలిశారు.
డేటా చోరీ వ్యవహారంపై కూడా టిడిపి ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్కు వివరించింది. ఫారం 7 ద్వారా వోట్ల తొలగింపునకు తామే దరఖాస్తులు ఇచ్చిన విషయాన్ని వైసిపి నాయకుడు వైఎస్ జగన్ స్వయంగా అంగీకరించిన విషయాన్ని వారు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.
వివిప్యాట్ లెక్కింపు ద్వారా పోలయిన వోట్లు సరి చూడాలని కూడా టిడిపి ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్ను కోరింది. వివిప్యాట్ లెక్కింపునకు తామ పార్టీ తెలంగాణా ఎన్నికలలో కోరినప్పటికీ ఎన్నికల కమిషన్ స్పందించ లేదంటూ, ఈసారి అన్ని నియోజకవర్గాలలో వివిప్యాట్ లెక్కింపు జరగాలని టిడిపి కోరింది.