రాష్ట్రంలో రాజకీయ పరిస్థితు లు హాట్ హాట్ గా ఉన్నాయి. అధికార వైసీపీ, జగన్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో పార్టీ క్యాడర్ లో మనోధైర్యం నింపాల్సిన అవసరం ఉంది. టీడీపీలో చంద్రబాబు తర్వాత పార్టీని సమర్థవంతంగా నడిపించేది ఎవరన్న ప్రశ్న చాలా కాలం నుండి వినిపిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వారసుడిగా నారా లోకేష్ కొనసాగుతున్నప్పటికీ ఆయనలో నాయకత్వ పటిమ లేదని పలువురు నేతలు అంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే కొందరు టిడిపి నేతలు అటు బిజెపి, ఇటు వై ఎస్ ఆర్ సి పి లో చేరటం, మరికొందరు కూడా వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధపడటం చూస్తున్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడిగా లోకేష్ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నేతలను ఉత్సాహపరుస్తుంది అంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో టిడిపి కీలక నేతలు అరెస్టులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే కరోనా వ్యాప్తి దృశ్యం చంద్రబాబు ఉ వయసురీత్యా ఎక్కడకు వెళ్లే అవకాశం లేకపోవడంతో లోకేష్ రంగంలోకి దిగి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చార ని చెబుతున్నారు. అచ్చం నాయుడు ని పరామర్శించడానికి వెళ్లడం, న్యాయవాదులను ఏర్పాటు చేయడం, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం లాంటి చర్యలు ఆ పార్టీ నేతల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూస్తున్నాయని అంటున్నారు.