అమరావతి, జనవరి 23: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు తెలుగుదేశం పార్టీ ఆహ్వానం అందింది. వంగవీటిని బుధవారం టిడిపి తరపున ఆపార్టీ ఎమ్మెల్సీలు బత్తుల అర్జునుడు, టిడి జనార్ధన్లు వంగవీటి కార్యాలయానికి వెళ్ళి తమ పార్టీలోకి రావాల్సిందిగా కోరారు. పార్టీలో చేరే అంశంపై రాధా గురువారం మీడియా సమావేశంలో వెల్లడిచేస్తారని వారు తెలిపారు. ఆయన వెల్లడించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని వారు అన్నారు.
వైసీపీ రాజీనామా అనంతరం ఆయన తన అనుచరులతో చర్చలు జరిపారు.
ఈనెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబు వంగవీటి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి విజయవాడ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఈనెల 25న రాధా టిడిపి తీర్ధం పుచ్చకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈనెల 20న వైసిపికి రాధా రాజీనామా చేశారు.
2012 ఏప్రిల్ 27న రాధ వైసిపి అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.