అమరావతి : విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా గురి పెడుతున్న సోషల్ మీడియా పోస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో సంచలన వ్యాఖ్య వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టిడిపికి కావాల్సింది షో చేసే వాళ్లు కాదనీ, పరిస్థితులను ఎదుర్కొనే వాళ్లని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తున్నది.
విజయవాడ నుండి రెండవ సారి కేశినేని ఎంపిగా విజయం సాధించిన తరువాత పార్లమెంట్లో తనకు పార్టీ అధిష్టానం విప్ పదవి ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి పార్టీలోని కొందరు నేతలపై తనకు ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా అధికారపక్షంపైనా విమర్శలు సంధిస్తూనే ఉన్నారు.
TDP now requires task masters not show masters
— Kesineni Nani (@kesineni_nani) July 9, 2019