ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ ఉత్తరాంధ్రలో ఎక్కువగా మత్స్యకారులు ఉండే జిల్లా శ్రీకాకుళం. అటువంటి శ్రీకాకుళం జిల్లాలో భవనపాడు పోర్టు కోసం పెద్ద సంఖ్యలో మత్స్యకారులు ఎప్పటినుండో ఉద్యమాలు చేశారు. వీళ్లంతా ఉపాధి లేక చాలా వరకు చెన్నై అదే రీతిలో గుజరాత్ కి వలస వెళ్ళి పోతూ జీవనం సాగిస్తుంటారు. అటువంటిది వీరి కష్టం తన పాదయాత్ర లో తెలుసుకున్న వైఎస్ జగన్ కచ్చితంగా భావనపాడు పోర్ట్ అధికారంలోకి వస్తే నిర్మిస్తానని హామీ ఇవ్వటం జరిగింది.
దీంతో జగన్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తున్న తరుణంలో తాజాగా జగన్ దృష్టి శ్రీకాకుళం జిల్లాపై పడింది. ఈ సందర్భంగా ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ కి జగన్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మూడు సంవత్సరాల లోపు ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తిచేయాలని టైం ఫిక్స్ చేసింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేపట్టడానికి పెద్దఎత్తున నిధులు కూడా మంజూరు చేసినట్లు సమాచారం.
మొత్తంమీద చూసుకుంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసి శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు కానుకగా ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు టాక్. దీంతో ఈ విషయం తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లా మొత్తం థాంక్యూ సీఎం జగన్ అంటుంది. శ్రీకాకుళం జిల్లా వాసులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న భావనపాడు పోర్టు కి జగన్ ఆమోదముద్ర వెయ్యడంతో చాలావరకు శ్రీకాకుళం వాసులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా అడ్డుకట్ట పడింది. ఈ దెబ్బతో శ్రీకాకుళం అభివృద్ధి మరింతగా దూసుకుపోయే విధంగా మారింది.