ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటుకి ఇటు గవర్నర్ అటు కేంద్రం నుండి సానుకూల వాతావరణం రావడంతో దాదాపు ఏపీకి మూడు రాజధానులు ఖరారై పోయినట్లే అని చాలా మంది చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఓ పార్టీ మరియు ఓ సామాజిక వర్గం మాత్రం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రాజధానుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర ఉందని తెగ గగ్గోలు పెడుతోంది. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని అంటున్న పార్టీలు మరియు కొన్ని సామాజిక వర్గాలు కేసిఆర్ ప్రస్తావన తీసుకు వస్తూ ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.
దీన్ని డీల్ చేయడంలో భాగంగా ఈ పార్టీలకు, అమరావతి ని సపోర్ట్ చేసే ఓ సామాజిక వర్గానికి అనుకూలంగా ఉండే మీడియా చానల్స్ లో కూడా కేసిఆర్ డైరెక్షన్లోనే ఏపీకి మూడు రాజధానులు అంటు డిబేట్ ల మీద డిబేట్ లు పెడుతున్నాయి. అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్ కి నష్టం వస్తుందన్న భయంతో కేసీఆర్ ఎత్తుగడ వేయడంతో ఏపీ ప్రభుత్వం ఆ ఎత్తుగడకు లొంగిపోయి….ఏపీ రాజధాని మేటర్ లో కేసీఆర్ మాట విని జగన్ మూడు రాజధానులు పెట్టినట్లు ఆ చానల్స్ కథనాలు మీద కథనాలు వండివార్చుతున్నారు. కేసిఆర్ ఎత్తుగడ వేశారని ప్రచారం చేస్తున్నాయి.
ఇంకా సదరు మీడియా ఛానల్స్ లో అమరావతి బ్రాండ్ దెబ్బతినేలా జగన్ -కేసీఆర్ కలిసి కుట్ర పన్నుతున్నట్లుగా వార్తలు ప్రసారం చేస్తున్నాయి. వీటినన్నిటినీ గమనిస్తున్న ఏపీ జనాలు సోషల్ మీడియాలో….. సదరు మీడియా ఛానల్స్ కథనాలు చూసి నవ్వుతున్నారు. అమరావతి ఎక్కడ ? అసలు హైదరాబాద్ ఎక్కడ ?…. అంటూ కౌంటర్లు వేస్తున్నారు. కేసీఆర్ మాట జగన్ వింటున్నాడని వస్తున్న వార్తలపై హాస్యాస్పదం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క పర్మినెంట్ బిల్లింగ్ లేని అమరావతి గురించి కేసీఆర్ భయపడుతున్నాడు అని చెప్పడం మరీ ఎటకారం గా ఉందని నెటిజన్లు జోకులు వేసుకుంటున్నారు.