ఏపీ బిజెపి అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టగానే పార్టీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారిని టార్గెట్ చేసి ఆదిలోనే చుక్కలు చూపించారు కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు. పలు మీడియా ఛానల్స్ కి కూడా తనదైన శైలిలో సోము వీర్రాజు కౌంటర్లు వేశారు. పరిస్థితి ఇలా ఉండగా పార్టీ కోసం పని చేస్తున్న వారిని తాజాగా కాపాడుకునే పనిలో పడ్డారు. దానిలో భాగంగా బిజెపి నాయకురాలు యామిని శర్మ పై టీటీడీ పెట్టిన కేసును వెంటనే ప్రభుత్వం విత్ డ్రా చేసుకోవాలని సోము వీర్రాజు సూచించారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ ని డిమాండ్ చేశారు. అయోధ్య రామాలయం భూమి పూజ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా 250 ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చూపించాయి. కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ఐదు నిమిషాలు కూడా చూపించకపోవడం చాలా దారుణం అని సోము వీర్రాజు పేర్కొన్నారు.అయితే ఈ అంశంపై మాట్లాడారని బీజేపీ పార్టీకి చెందిన యామిని శర్మ పై కేసు పెట్టడం సరైన పద్ధతి కాదని, వెంటనే ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకోవాలని కొత్త చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు.