అమరావతి: రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ‘సీఎం జగన్ సొంత ప్రతిష్టను పెంచుకోవడానికి అప్పు చేసి పప్పుకూడు పెడుతున్నారని ‘కిరసనాయిలు’ తన టీవీలో ఏడుపు రాగాలు తీశాడు. మరి చంద్రబాబు నాయుడు 2.60 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన సంగతిని మాత్రం చెప్పడు. 60 వేల కోట్ల రూపాయల పెండింగు బిల్లులు మిగిల్చి వెళ్లిన విషయం ప్రస్తావించడు. దోపిడీలో తనూ భాగస్వామే కదా!’ అని ట్విట్ చేశారు.
‘దేశంలోనే అత్యంత అసమర్థ ఆర్థిక మంత్రిగా యనమల రికార్డులకెక్కారు. అధిక వడ్డీ ఆశ చూపి దొరికిన చోటల్లా అప్పు చేసి బోర్డు తిప్పేసే ఫైనాన్స్ కంపెనీ కంటే దారుణంగా ఆర్థిక నిర్వహణ సాగింది ఆయన హయాంలో. అధికారం కోల్పోయాక శ్రీరంగ నీతులు చెబుతున్నారు’ అని మరో ట్వీట్ లో విమర్శలు గుప్పించారు.
సిఎం జగన్ గారు సొంత ప్రతిష్ఠ పెంచుకోవడానికి అప్పు చేసి పప్పుకూడు పెడుతున్నాడని ‘కిరసనాయిలు’ తన టీవీలో ఏడుపు రాగాలు తీశాడు. @ncbn 2.60 లక్షల కోట్ల అప్పులు చేసిన సంగతి చెప్పడు. 60 వేల కోట్ల పెండింగు బిల్లులు మిగిల్చి వెళ్లిన విషయం ప్రస్తావించడు. దోపిడీలో తనూ భాగస్వామే కదా!
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 21, 2019
దేశంలోనే అత్యంత అసమర్థ ఆర్థిక మంత్రిగా యనమల గారు రికార్డులకెక్కారు. అధిక వడ్డీ ఆశ చూపి దొరికిన చోటల్లా అప్పు చేసి బోర్డు తిప్పేసే ఫైనాన్స్ కంపెనీ కంటే దారుణంగా ఆర్థిక నిర్వహణ సాగింది ఆయన హయాంలో. అధికారం కోల్పోయాక శ్రీరంగ నీతులు చెబుతున్నారు. @ncbn
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 21, 2019