శ్రీకాకుళం, జనవరి 7: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. గత 14 నెలలుగా జగన్ చేస్తున్న పాదయాత్ర ఈ నెల తొమ్మిదిన ఇఛ్చాపురంలో భారీ బహిరంగ సభతో ముగియనుంది.
ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని తలతంపర నుండి ప్రతిపక్ష నేత సోమవారం యాత్రను ప్రారంభించారు. అక్కడి నుండి బల్లి పుట్టుగ, కుసుంపురం, బొరివంక మీదుగా బెజ్జిపుట్టుగ, జగతి వరకు యాత్ర కొనసాగుతుంది.
2017 నవంబరు ఆరున జగన్ పాదయాత్ర ఇడుపులపాయనుండి ప్రారంభించారు. ఇప్పటివరకు 3,600 కిలోమీటర్లకు పైగా ఆయన పాదయాత్ర నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
previous post
next post